Saturday, September 3, 2011

దర్శనాలూ



తరించేలా సేవలూ

"శ్రీవారి భక్తులకి విశేషమైన సేవలందించి వారి ఆత్మీయతను అందుకుంటాను.
ఉడతాభక్తిగా శ్రీవారి సేవలో పాల్గొని యాత్రికుల కష్టాలను తొలగిస్తాను.
వసతి సౌకర్యం కల్పనలో ఎదురవుతున్న సమస్యలను తొలగిస్తాను.
భక్తులే దేవుళ్లుగా సేవలందిస్తానని హామీ ఇస్తున్నాను.
అలిపిరి నుంచి తిరుమలకి వచ్చి, శ్రీవారిని దర్శించి, తరించి, తిరిగి అలిపిరి చేరేవరకు నేను పూచీగా వుంటాను"
"ముఖ్యమంత్రి కి కు రె విశ్వాసాన్ని వమ్ముచేయకుండా నడుచుకుంటాను.
సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాను"

......ఇవన్నీ క్రొత్తగా తి తి దే పాలకమండలి అధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేసిన బుగ్గమీసాల బాపిరాజుగారి వువాచలు!

మరి ఈయన వొరగబెట్టింది యేమిటి?

బంగారువాకిలిలోని గరుడాళ్వారు ముందు ప్రమాణస్వీకారం చేశాడు ఇతర సభ్యులందరితోనూ, ప్రతీ సభ్యుడి వెనకా మూకలతోనూ!

3 గంటలకి పైగా భక్తుల దర్శనాన్ని నిలిపేశారుట! భక్త దేవుళ్ల "సేవకి" అలా శ్రీకారం చుట్టాడన్నమాట!

200 మంది అనుచరగణం బంగారువాకిలి లోకి చేరుకొన్నారట. ఇంకో 400 మంది బయట వెండివాకిలివరకూ ఆక్రమించారట! అందరూ బంగారువాకిలిలో దూరడానికి తోసుకున్నారట. సిబ్బందితో వాగ్వాదం చేశారట. యెలాగైతేనేం, ప్రమాణస్వీకారం అయ్యాక, అందరూ లోపల చొరబడ్డారట!

అదీ శ్రీవారిమీద ఆయనకీ, అనుచరులకీ వున్న గౌరం, భక్తీ!

భార్యతో శ్రీవారి కళ్యాణోత్సవం లో పాల్గొన్నారట. రాత్రి మళ్లీ "అనుచరగణానికి" వీ ఐ పీ దర్శనానికి యేర్పాట్లు చేశారట! ఇదీవారి "ఉడతాభక్తి"!

పద్మావతి నగర్లో అతిథిగృహాలు ఖాళీలేకుండా పోయాయట!

ఇవీ ఆయన వసతి సౌకర్యాల కల్పనలో సమస్యలని తొలగించే, భక్తులే దేవుళ్లుగా సేవలందించే, దర్శించి తరించేవరకూ పూచీపడే--పధ్ధతులు! 

ఈవోగారిమీద ఇదివరకే యేవో ఆరోపణలున్నాయన్నారు. మరి ఇప్పుడు వీళ్లిద్దరూ కలిస్తే, యెన్నికొండలని కరిగించడానికి ప్లాన్లు వేస్తారో!

బాగుంది కదూ రాజుగారి పాలన!