Tuesday, May 11, 2010

దర్శనాలూ, సేవలూ


ఆ(ర్జిత)ర్జన సేవలు

సేవల కోసం టిక్కెట్లని ఆన్ లైన్ లో విక్రయించడం తో, ఒక్కో భక్తుడిపేరిట కొన్ని వందల టిక్కెట్లు నమోదయ్యాయట.

అందుకని, ఇప్పుడు 'కఠిన నిర్ణయం' తీసుకొని, మార్గదర్శకాలు జారీ చేశారట.

ఇకపై గృహస్థులు యేడాదికి ఒకసారి మాత్రమే వస్త్రాలంకార (మేల్ చాట్ వస్త్రం) సేవలో పాల్గొనే అవకాశం ఇస్తారట.

అభిషేకం, తోమాల, అర్చన, సుప్రభాతం, సేవాటిక్కెట్లపై, యేదైనా ఐదు టిక్కెట్లపై మాత్రమే శ్రీవారి సేవలో పాల్గొనడానికి అనుమతిస్తారట.

సేవ వినియోగించుకునే సమయాన్ని యెంచుకునే అవకాశం భక్తులకే ఇస్తారట.

రేపు శుక్రవారం నించే, భక్తులు వైకుంఠం-1 వద్ద తమ గుర్తింపుకార్డులు చూపిస్తేనే, అనుమతిస్తారట.

గమనించండి--ఇక్కడకూడా భక్తులకే నష్టం!

విచక్షణ కోటా క్రింద రోజూ వెళ్ళే వందలాదిమందికి యేమీ నష్టం వుండదు!

అసలు ఇంత అవకతవక, కంగాళీ విధానాన్ని యెలా ప్రవేశ పెట్టారు? యే సాఫ్ట్ వేర్ నైనా కొన్ని వందలసార్లు పరీక్షించి, అది సరిగా పని చేస్తోందని నిర్ధారణ అయ్యాకే, ప్రవేశ పెడతారు కదా? 

ఆ విషయం వీళ్ళకి వర్తించదా? దీనికి బాధ్యులెవరు?

సమాధానం యెవరు చెపుతారు!

Sunday, May 2, 2010

శ్రీగిరి శ్రీపతి

'......గోవిందా!'(లు)

పట్టణ గోవిందం, పల్లె గోవిందం, గిరిజన గోవిందం లు కిట్టుబాటు కావడం లేదు కాబోలు--యేకం గా 'ఫారిన్  గోవిందం' తలపెట్టి, ఓ మందని దేవస్థానం ఖర్చుతో ఫారిన్ యాత్ర చేయిద్దామనుకొన్నారు.

దైవమింకొకటి తలిచి, మందలో చాల మందికి వీసాలు రాకపోవడం తో, కొంతమందే వెళ్ళారు.

ఓ నగరం లో మొన్ననే ఓ గోవిందం 'దిగ్విజయం' గా పూర్తయ్యింది కూడా!

యెలా?

1000 డాలర్లు చెల్లించినవారికి--వీ ఐ పీ దర్శనం, 10 నించి 1000 లోపు డాలర్లు చెల్లించినవారికి--ఓ గంటనించి 10 గంటల్లో దర్శనం--ఇలా దండుకున్నారని మీడియా కోడై కూస్తోంది. 

(ఈ మీడియాకేం పనిలేదు. అస్తమానూ కోడైపోతూ వుంటుంది--అని విసుక్కుంటున్నారు నిర్వాహకులు!)

1000 డాలర్లంటే దాదాపు 50,000 రూపాయలు!

మరీ ఇంత కక్కుర్తా అని చెవులు కొరుక్కుంటున్నారు--ప్రవాసీ భక్తులు!

పోతే వాళ్ళే కదా! మనకేం?