Wednesday, January 12, 2011

శ్రీగిరి శ్రీపతి

(ప్రసాద) లడ్డూలు

ఆ మధ్య శ్రీవారి లడ్డూలు "వుప్పు కషాయం"గా వున్నాయని ఓ ఫిర్యాదు రాగా, ఓ 600 లడ్డూల్లో ఆ విషయం నిజమేనని తేల్చి, అమ్మకం ఆపేశారట. సంబంధిత కాంట్రాక్టరు, ఓ ఇరవై పైగా యేళ్లనించీ లడ్డూలు చేయిస్తున్నా, ఇలా యెప్పుడూ జరగలేదు అన్నాడట. సరే.

సంబంధిత అధికారులు కొంతమంది, 'వుగ్ర్తాణం లోంచి పొరపాటున చక్కెరకి బదులు వుప్పు తెచ్చివుంటారు' అనీ, 'వుగ్రాణంలో వుప్పు ప్రసక్తిలేదు....గోవిందస్వాములు తమ ఇరుముడిల్లో తెచ్చిన వుప్పునే ఆ లడ్డూల్లో వాడి వుంటారు' అనీ--ఇలా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు.

వుగ్రాణంలో 'రాళ్ల'వుప్పు వుంటుందా? పొడి వుప్పు వుంటుందా? చక్కెర 'ముడిగా' వుంటుందా, పొడిగా వుంటుందా? 20 యేళ్లకి పైగా లడ్డూలు చేస్తున్నవాళ్లకి--రాళ్ల వుప్పుకీ, ముడి చక్కెరకీ, మెత్తటి వుప్పుకీ, మెత్తటి చక్కెరకీ తేడాలు తెలియవా? 

సరే.....గోవిందస్వాములు యెన్ని కేజీల వుప్పుని సమర్పించారు? యెక్కడ? అది వుగ్రాణానికి యెలా చేరింది? అలాకాదు అంటే, నేరుగా ఆ పోటు కాంట్రాక్టరుకెలా చేరింది? లడ్డూల్లోకెలా చేరింది? ఇవన్నీ ప్రశ్నలే!

ఇవాళ లడ్డూల్లో 'మేకులు' వచ్చాయంటున్నారు! సంబంధిత కాంట్రాక్టరు, 'లవంగాలనుకొని, మేకులు తెచ్చారు' అంటాడేమో!

చూద్దాం! 

ఈవోగారూ! నాలుగుకళ్లతో పరిశీలిస్తారా?

Saturday, January 8, 2011

శ్రీగిరి శ్రీపతి

.....దేవస్థాన లీలలు

తిరుపతి-షిర్డీ భాయి భాయి బాగానే కొనసాగిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా (టిక్కెట్టు తీసుకునే) ప్రత్యేక దర్శనాలని రద్దు చేశారు.

అన్నట్టు సాయి మందిరానికి రూ.32 కోట్ల విలువైన ఆభరణాలు వున్నట్టు ఆడిట్ వాళ్లు తేల్చారట. వార్షిక అదాయం 164 కోట్లట!

గత కొన్నేళ్లుగా మాత్రమే ఆభరణాలు వస్తున్న సాయికే 32 కోట్లు వుంటే, కొన్నివందలయేళ్లుగా వున్న స్వామికి కేవలం 51 కోట్లే మరి! 

సంతోషిద్దాం.....ఇప్పటికైనా అని.

శ్రీవారి బంగారు తాపడం చేసిన రథానికి వుండే స్వచ్చమైన బంగారంతో చేసిన, కోటి రూపాయలు విలువ చేసే 'గొడుగు' ని, రథం వున్న రేకుల మండపం దక్షిణవైపు రేకుని 'కత్తిరించి' యెవరో దొబ్బేశారట! అదికూడా, ఆ ప్రక్కనే జరుగుతున్న పెద్దజీయర్ మఠం కార్మికులు చెపితే, అధికారులకి తెలిసిందట! యెంత భద్రతో కదా?!

పైగా, నిన్న 07-01-2011 న, 'మహా అయితే ఆ రేకుల గొడుగు విలువ ఓ నలభై వేలే వుంటుంది.....రేపు రథ సప్తమికల్లా ఓ కొత్త గొడుగు చేయించి పారేస్తామంటున్నారు అధికారులు!' అని హామీ ఇస్తూ, పుండుమీద కారం చల్లుతున్నాడు రాష్ట్ర శాసన మండలి 'హామీల కమిటీ' అధ్యక్షులు బత్యాల చెంగల్రాయుల వారు! (యెన్ని కోట్లతో చేయిస్తారో చెప్పలేదు.....మామూలుగానే!)

యేడూ కొండల స్వామీ.......!

....................................................................................................................................................................

ప్రకటన :

శ్రీ దత్త చరితం

తొలి జగద్గురువు, విఙ్ఞానపు కాంతులను విరజిమ్మిన క్రాంతి పుంజం, అత్రి, అనసూయల గర్భ సుక్తి ముక్తాఫలం--శ్రీ దత్తాత్రేయుడు. ఆపురూప గురుహారం ఈ శ్రీ దత్త చరితం. 

ఈ డాక్యుమెంటరీ కి నిర్మాత, కెమేరామన్ : చిట్టావఝల కృష్ణ; వ్యాఖ్యనం/దర్శకత్వం : చక్రావధానుల రెడ్డప్ప ధవేజీ; సంగీతం/గానం : గోగులమండ రాజు & మోహిని కుమారి; సహ నిర్మాత : సవరం కృష్ణానందం. ప్రవచనం : 'భారతీపుత్ర ', కడిమెళ్ల వర ప్రసాద్ 'గురు సహస్రావధాని '. 

(దత్తచరిత్ర యథాతథంగా, కూర్పులూ, చేర్పులూ లేకుండా చెప్పబడింది--అనుచిత వ్యాఖ్యలు లేకుండా! దత్తపీఠలూ, క్షేత్రాలూ వగైరలు కూడా చూడండి.) 

ఈ సీడీలు కొనండి....ఒక్కొక్కటీ రూ.59/- మాత్రమే! ఈ ప్రకటన చూసి, ఆర్డరు ఇచ్చినవారికి రూ.54/- మాత్రమే. 

చిట్టావఝల కృష్ణ పేరున "మాకు అందేలా" కేరాఫ్ నర్సాపూర్ బ్రాహ్మణ సమాఖ్య, నరసాపురం, ప.గో.జిల్లా, 534275 కి (మనియార్డరు/పోస్టల్ ఆర్డరు/డీడీ) యెలాగైనా పంపించండి....ఓ సీడీ సొంతం చేసుకోండి! (ఇందులో వ్యాపారం లేదు.)

మీరు కోరితే, మీ మెయిల్ ఐడీ కి వీడియో పంపించడానికి ప్రయత్నిస్తాము.