Wednesday, January 12, 2011

శ్రీగిరి శ్రీపతి

(ప్రసాద) లడ్డూలు

ఆ మధ్య శ్రీవారి లడ్డూలు "వుప్పు కషాయం"గా వున్నాయని ఓ ఫిర్యాదు రాగా, ఓ 600 లడ్డూల్లో ఆ విషయం నిజమేనని తేల్చి, అమ్మకం ఆపేశారట. సంబంధిత కాంట్రాక్టరు, ఓ ఇరవై పైగా యేళ్లనించీ లడ్డూలు చేయిస్తున్నా, ఇలా యెప్పుడూ జరగలేదు అన్నాడట. సరే.

సంబంధిత అధికారులు కొంతమంది, 'వుగ్ర్తాణం లోంచి పొరపాటున చక్కెరకి బదులు వుప్పు తెచ్చివుంటారు' అనీ, 'వుగ్రాణంలో వుప్పు ప్రసక్తిలేదు....గోవిందస్వాములు తమ ఇరుముడిల్లో తెచ్చిన వుప్పునే ఆ లడ్డూల్లో వాడి వుంటారు' అనీ--ఇలా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు.

వుగ్రాణంలో 'రాళ్ల'వుప్పు వుంటుందా? పొడి వుప్పు వుంటుందా? చక్కెర 'ముడిగా' వుంటుందా, పొడిగా వుంటుందా? 20 యేళ్లకి పైగా లడ్డూలు చేస్తున్నవాళ్లకి--రాళ్ల వుప్పుకీ, ముడి చక్కెరకీ, మెత్తటి వుప్పుకీ, మెత్తటి చక్కెరకీ తేడాలు తెలియవా? 

సరే.....గోవిందస్వాములు యెన్ని కేజీల వుప్పుని సమర్పించారు? యెక్కడ? అది వుగ్రాణానికి యెలా చేరింది? అలాకాదు అంటే, నేరుగా ఆ పోటు కాంట్రాక్టరుకెలా చేరింది? లడ్డూల్లోకెలా చేరింది? ఇవన్నీ ప్రశ్నలే!

ఇవాళ లడ్డూల్లో 'మేకులు' వచ్చాయంటున్నారు! సంబంధిత కాంట్రాక్టరు, 'లవంగాలనుకొని, మేకులు తెచ్చారు' అంటాడేమో!

చూద్దాం! 

ఈవోగారూ! నాలుగుకళ్లతో పరిశీలిస్తారా?

No comments: