Friday, December 18, 2009

శ్రీగిరి శ్రీపతి


"తిరుప్పావై"

ఆంధ్రదేశానికీ, తెలుగువాళ్ళకీ వ్యతిరేకం గా, బాగా వేళ్ళూనుకొన్న కుట్ర యేదో జరుగుతోందేమో అనిపిస్తూంది నాకు.  


ఇదేదో--ప్రత్యేక తెలంగాణా గురించో, సమైక్య ఆంధ్ర గురించో, 'తిరు ' చిదంబరం గురించో అనడం లేదు.  


శ్రీగిరి శ్రీపతి దేవస్థానం మొత్తం క్రమం గా 'తమిళీకరణ ' జరుగుతోందా--అని అనుమానం వస్తోంది!  


లేకపోతే, సుప్రభాత సేవ కూడా రద్దుచేసి, 'తిరుప్పావై' పఠించాలని నిర్ణయించడం గత 40 యేళ్ళలో యెప్పుడైనా జరిగిందా? జరిగితే యెప్పుడు మొదలయ్యింది?  


ఇంకా తి తి దే వారి "ఆళ్వారు దివ్య ప్రబంధ ప్రాజెక్ట్" సంస్థ ద్వారా, ఆంధ్ర దేశమంతటా, చిన్న పట్టణాళ్ళో కూడా, ఊరూపేరూ లేని విష్ణ్వాలయాలలోనూ, శివాలయలలోవున్న చిన్న చిన్న వైష్ణవాలయాల్లోనూ 'ధనుర్మాసం' పేరు చెప్పి, ప్రతిరోజూ 'తిరుప్పావై' పఠింపచెయ్యడం యేమిటి?  


దానికి పత్రికలూ, మీడియా అమాయకం గా పబ్లిసిటీ ఇవ్వడం యేమిటి?  


ఉదాహరణకి--పంచారామాల్లో ఒకటైన భీమవరం లోని భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం లోని--శ్రీ రాధాకృష్ణ దేవాలయంలో--ఈ నెల 16 నించి జనవరి 14 వరకూ, అదే వూళ్ళో, 'సాంస్కృత కేంద్రం' లో వేంచేసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద--ఈ నెల 16 నించి జనవరి 13 వరకూ, పాలకొల్లులో 'అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి 'ఆలయంలోనూ, తిరుప్పావై ప్రవచనాలు జరుగుతాయట!  


ఇక ఈనాడు 'ఆధ్యాత్మికం' లో ఆప్పరుసు రమాకాంతరావు గారు (ఈయన క్రెడెన్షియల్స్ యేమిటో నాకు తెలియవు)-- 'విష్ణుచిత్తుడికి ' ఓ పాప దొరికితే, ఆమెకి 'చూడి కొడుత్త నాచ్చియర్ ' అని పేరు పెట్టాడని--అవాకులూ చెవాకులూ యెందుకు వ్రాసారో, దాన్ని ఈనాడు వారు యెందుకు ప్రచురించారో--వారికే తెలియాలి!  


విష్ణుచిత్తుడికి దొరికిన పాపకి ఆయన పెట్టింది 'గోదాదేవి ' అనే పేరు! దాన్నే తమిళులు 'ఆండాళ్' అని పెట్టుకున్నారు!  


మరి 'చూడి కొడుత్త నాచ్చియర్ ' యేమిటి?  


గోదాదేవి యుక్తవయస్సులోకి వచ్చాక, రంగనాధుడిని వరించి, తను అందంగా వున్నానో లేదో, స్వామికి నచ్చుతానో లేదో అనుకొంటూ--స్వామికోసం కట్టిన పూల మాలల్నీ, దండల్నీ తానే ధరించి, నూతిలో నీడ చూసుకొని నమ్మకం కుదిరాక, వాటిని స్వామికి అలంకరించేది (ట)! అందుకని, 'తాను ధరించినవి అర్పించినది ' అనే అర్థం లో, 'శూడి కుడుత్త నాచ్చియర్ ' అన్నారట! 


(ఆవిడ శ్రీరంగనాధుణ్ణే పెళ్ళాడానని వూహించుకోవడం, తిరుప్పావై రచించి గానం చెయ్యడం చరిత్ర--లేదా కొంతమందికి పుక్కిటి పురాణం!)  


మరి ఆంధ్రులకి ఈ భావ దాస్యం యెందుకు?  


ఐటీ, నీటిపారుదల, పారిశ్రామిక రంగాల్లో అభివృధ్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ ను ముక్కలు చెయ్యడానికి తమిళులు కుట్ర పన్నుతున్నారని అనుమానాలు వస్తున్నాయి అని మాజీ మంత్రి మాగంటి బాబు కూడా అన్నారట!  


నేను మరోసారి హెచ్చరిస్తున్నాను--శ్రీగిరి శ్రీపతి ఆలయాన్ని 'వైష్ణవ దేవాలయం' అని వ్యవహరించడానికి వీల్లేదు!  


ఆయన దేశ, కాల, భాషా, ప్రాంతీయ, కుల, మతాలకి అతీతుడు--కోట్లాది భారతీయులకి--అందులో సామాన్యులకి--కలియుగ దైవం!  


పిచ్చి పిచ్చి వేషాలు వేశారో--ఝాగ్రత్త!

Monday, November 30, 2009

శ్రీగిరి శ్రీపతి

నిర్మాణాలు, కేటాయింపులు

“నిత్యం వివాహాలు చేసుకొనేందుకు వీలుగా, ‘కేంద్రీకృత కల్యాణ వేదిక’ నిర్మించాలని పాలక మండలి నిర్ణయించి, వాళ్ళ ఇంజనీరింగు విభాగానికి అనుమతి” ఇచ్చిందట.
“పురోహిత సంఘాన్ని కూడా కల్యాణవేదిక వద్దకు” మార్పు చేస్తారట.
(ఇన్నాళ్ళూ వివాహాలు యెక్కడ యెలా జరుగుతున్నాయో, పురోహిత సంఘం యెక్కడ వుందో—వీటివల్ల ఇబ్బందులేమైనా వున్నాయో నాకైతే తెలియదు—తెలిసున్నవాళ్ళు చెపితే సంతోషం!)
అయినా యెందుకు వ్రాస్తున్నానంటే, ‘నిర్మాణాలు‘ అనేప్పటికల్లా, యెందుకంత ‘శీఘ్రం గా’ నిర్ణయాలూ, అనుమతులూ జరిగిపోతాయో అని నా అనుమానం! (శుభ్రం గా ఇసుకా, సిమెంటూ, కంకరా భోంచెయ్యచ్చనా అని సందేహం!)
ఇక, “వరదలకారణం గా నష్టపోయిన ఆలయలకు ఆర్థిక సహాయం” చేస్తారట! బాగుంది.
మరి, ఈ పేరుతో, మొదట ‘మంత్రాలయం’ లో అభివృధ్ధి పనులకోసం, 5 కోట్లు యెందుకు కేటాయించాలి? 

అదేమీ పురాతన హిందూ దేవాలయం కాదే? పైగా రాఘవేంద్రస్వామి కి వుండే భక్తులు ఆయనకి వున్నారు—ఆ మఠం ప్రస్తుత స్వామిని, వరదలు మొదలయ్యేలోపల, హెలికాప్టరులో సురక్షిత స్థానానికి తరలించారు కదా? మరి ఆ సంస్థ అంత బీద స్థితిలో వుందనా ఈ గొరిగింపు? (ఈ వంకని ‘సిఫార్సు’ చెయ్యబడ్డ అడ్డమైన గుడికీ కేటాయింపులు చేసుకోవచ్చనేమో అని నా అనుమానం!)
పైగా, కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణాలయం లో ‘అన్న బ్రహ్మ’ (ఈ బ్రహ్మెవరో!) పథకాన్ని ఆదివారం (29-11-2009) న ఆదికేశవుడు ప్రారంభిస్తాడట.
అన్నవరం సత్యదేవుడితో మొదలెట్టి, జంగారెడ్డిగూడెం దగ్గర ‘గోకుల తిరుమల పారిజాత గిరి’ మీది స్వామి వరకూ, వాళ్ళ వాళ్ళ ‘నిరతాన్నదాన’ పథకాలు ప్రవేశపెట్టుకున్నారు! ప్రతీ వీధి చివరి గుడీ, పర్వదినాల్లో ‘అన్న సంతర్పణలు’ చేస్తున్నాయి! మరి ఉడిపి స్వామి కేమి దొబ్బుడాయి?
ఇవన్నీ మారాలంటారా, వద్దా?

Sunday, November 29, 2009

శ్రీగిరి శ్రీపతి


ఆభరణాల లెఖ్ఖలు—2

మొత్తానికి దేవస్థానం వారు ఓ మూడు కంపెనీలకో యేజన్సీలకో శ్రీవారి నగల విలువని నిర్ధారించడానికి కాంట్రాక్టు ఇచ్చారట. మరి వీళ్ళలో యెవరెవరు యేయే ఆభరణాలకి యెంతెంత విలువ యెలా యెలా కడతారో చూద్దాం!

వున్న ఆభరణాల మాట సరే, మరి లేవేమో అని అనుమానిస్తున్నవాటి మాటేమిటి?

ఇంకో సంగతి—గాలి సమర్పించిన కిరీటానికి ‘బిల్లులు ‘ లేవట! అసలు ఇచ్చాడో లేదో, ఇనుముమీద కోటింగు ఇప్పించాడో యెవరికి తెలుసు!

ఇక సేవల విషయం లో కూడా, రద్దు చెయ్యట్లేదని తెలుస్తోంది!

పైగా, చంటిపిల్ల తల్లులకి దర్శనాన్ని యెత్తేశారట.

ఇంకో ముగ్గురినో యెందరినో ఎం ఎల్ యే లని పాలక మండలి లో చేర్చుకొన్నారట. సరే.

వాళ్ళు ప్రమాణస్వీకారం చేసే తతంగం జరుగుతున్నంతసేపూ, ధర్మ దర్శనం, శీఘ్ర దర్శనం క్యూలని ఆపేశారట!

ఇలాంటి తతంగాలని యే టీ టీ డీ ఎడ్మినిస్ట్రేటివ్ బిల్డింగులోనో యేడవచ్చుగా? దర్శనాన్ని ఆపేసి, గుడిలో దొబ్బించుకోవడం యెందుకు?

శ్రీవారు పాలకులకీ, వాళ్ళ మండళ్ళకీ మంచి బుధ్ధిని ఒసగు గాక!

Thursday, November 5, 2009

శ్రీగిరి శ్రీపతి


ఆభరణాల లెఖ్ఖలు

అనుకున్నంతా అయ్యింది! కోర్టువారికి తి తి దే వారు శ్రీ వారి ఆభరణాల విలువ కేవలం రూ. 52 కోట్లే (52 వేల కోట్లు కాదు) అని చెప్పారట!  


అలా యెందుకంటే, 'అప్పటి లెఖ్ఖల ప్రకారమే మేము కూడికలూ, తీసివేతలూ చెయ్యగలం గానీ, హెచ్చవేతలూ అవీ మాకు రావు కదండీ' అంటున్నారట!  


ఉదాహరణకి శ్రీ కృష్ణదేవరాయలు చేయించిన వజ్రకిరీటం విలువ ఆ రోజుల్లో అర్థనూట పదహార్లు అనుకుందాం--దాంట్లో బంగారం ఓ 30 రూపాయలూ, మిగిలిన కెంపులూ, పచ్చలూ, వజ్రాలూ, వైడూర్యాలూ, నీలాలూ, గోమేధికాలూ వగైరా--సైజులని బట్టి--మూడణాల ముక్కానీ నించి, మూడురూపాయల ముప్పావలా అర్థణా వరకూ లెఖ్ఖ వేసి, రూ. 28 సరిపెట్టారన్నమాట.  


ఇక రాలిపోయిన పెద్ద కెంపు విలువ--మూడురూపాయల ముప్పావలా అర్థణాయే కదా?  


ఈ లెఖ్ఖన మొత్తం ఆభరణాలు యెంత యెక్కువగా లెఖ్ఖగట్టినా, రూ. 52 కోట్లంటే--అన్నన్నా! యేమి తి తి దే వారి దాతృత్వము!  


పోనీ ఆ లెఖ్ఖలే చూసుకున్నా, గత 50 యేళ్ళుగా, మొన్నటి ఆర్థిక సంవత్సర ముగింపువరకూ వచ్చిన కానుకల్ని లెఖ్ఖవేసుకున్నా, అప్పటప్పటి ధరల ప్రకారమైనా, ఓ వందకోట్లన్నా వుండవా?  


నేను 'డైరీ' లో ప్రచురించిన వాటి విలువని కూడినా చాలానే వుంటుందే?  


మరి యెవరి చెవుల్లో పువ్వులు పెడతున్నారు?  


కోర్టే తేలుస్తుంది!


Sunday, November 1, 2009

శ్రీగిరి శ్రీపతి


ఘంటారావం


శ్రీగిరిపై యెక్కడా గంట వినిపించడం లేదు--ఆలయం లో గంట జాడగానీ, భక్తులెవరూ గంట కొడుతున్న జాడ గానీ లేవని వ్రాశాను ఇంతకు ముందు.  


ఇప్పుడు యేకం గా సాయంత్రం యేడున్నరనించీ ఓ అరగంటపాటు 'ఘంటారావం' పేరుతో 'భక్తి చానెల్ ' లో ప్రత్యక్ష ప్రాసారం చేస్తున్నారు యేదో ఓ చిన్న గంటని మ్రోగించి!  


గమనించారా?  


అదికూడా నిజం గా గుడిలో మోగిస్తున్నారో, టేప్ రెకార్డు చేసి వినిపిస్తున్నారో నాకు సందేహమే!  


మరి ఆలయం లోని పెద్ద కంచుగంట మోగిస్తే 'గాంగ్.........గాంగ్' అని మోగేది--అదేమయ్యిందో?  

Thursday, October 29, 2009

శ్రీగిరి శ్రీపతి


దర్శనాలు, సేవలు


రూ.600 ల శీఘ్ర దర్శనం అమల్లోకి వచ్చింది! మొదటిరోజు అస్తవ్యస్తంగా నడిచిందట--యెవరిని ముందు, యెవరిని వెనక అనే మీమాంసలతో!  


ఇక సేవల విషయం లో కమిటీ యేమీ తేల్చలేదు--త్వరలో తేల్చవచ్చట.  


సుప్రభాత, తోమాల సేవల రుసుము సుమారు 200 కావడంతో, దీన్ని పెంచాలని ఆలోచిస్తున్నారని వినికిడి. ఈ సేవల టిక్కెట్లు కొనుక్కున్నవాళ్ళు, కనీసం ఓ గంటసేపు స్వామి సన్నిధిలో వుండిపోతారట.  


ఇప్పుడు తెల్లవారుజామున 4.30 నించీ, రాత్రి 2.30 వరకూ, 22 గంటల్లో, మహాలఘు దర్శనం తో దాదాపు 80 వేలమందికి దర్శనం కలిగించేస్తున్నారు! అంటే స్వామి అలంకారానికీ, భోగానికీ, సేవలకీ ఓ నాలుగు గంటలు మినహాయించినా, 64800 సెకన్లలో, సెకనుకి సుమారు ఒకటింపావు మంది దర్శనం చేసుకుంటున్నారు! 


ఈ లెఖ్ఖన, రూ.600 శీఘ్రదర్శనం వాళ్ళుకూడ సెకనుకి ఒకటింపావు మంది మాత్రమే డర్శనం చేసుకోగలరు కదా (సెకనుకి దర్శనం ఖరీదు రూ.750/-!), మరి సేవల పేరుచెప్పి కనీసం గంట వుండేవాళ్ళ ఒక్కొక్కళ్ళ దగ్గరనించి 3600 సెకన్లకి, సెకనుకి రూ.750/- చొప్పున యెంత వసూలు చెయ్యాలి? (ఓ వందమంది ఆ సేవల టిక్కెట్లు కొన్నారనుకున్నా, ఒక్కొక్కళ్ళూ రూ.27000/- చెల్లించాలి!  


ఈ లెఖ్ఖలు మానేసి, ఈ సేవలన్నీ రద్దు చేస్తే, 'మహా' లేని 'లఘు' తోటే 80 వేలమంది దర్శనాలు చేసుకోవచ్చుకదా?  


తి తి దే ఆర్థికవేత్తలు యేమంటారో!  


ఇంకో ముఖ్యమైన విషయం--శీఘ్ర దర్శనం వాళ్ళూ, ఉచిత/టిక్కెట్టు సుదర్శనం వాళ్ళూ, చంటిబిడ్డ తల్లిదండ్రులూ, సన్నిధిలో వివాహం చేసుకున్న జంటలూ, వాళ్ళతోపాటు నలుగురో యెంతమందో, కాలినడకన కొండ యెక్కేవాళ్ళూ--ఇలా అందర్నీ 'మహర్ద్వారం' దగ్గర నించి ఒకే క్యూలో కలిపేసి, తోసుకుంటూ బంగారువాకిలి వరకూ పొమ్మనడాన్ని నివారించడానికి ఓ కమిటీనెందుకు వెయ్యరు?  


ఇది శ్రీవారి భక్తులందరి తరఫునా నా ప్రధాన 'డిమాండ్'. నెరవేర్చవలసిందే!  


పైగా, ఈ వో గారు--చంటిబిడ్డ తల్లులకొక్కళ్ళకే అనుమతిస్తే వాళ్ళు నలిగిపోతారని, వాళ్ళ భర్తలకి కూడా ప్రవేశం కల్పిస్తే, చైర్మన్ ఆదికేశవుడు దానికి మొదటినించీ వ్యతిరేకమేనట! 


మరి వాడి లెఖ్ఖలేమిటో!  


('డైరీ' కూడా అప్ డేట్ అయ్యింది. చదవండి)

Tuesday, October 20, 2009

శ్రీగిరి శ్రీపతి

డైరీ

తఱచుగా శ్రీవారికి భక్తులు సమర్పించే విలువైన కానుకల్ని తేదీలవారీగా ఈ డైరీలో అప్ డేట్ చేస్తూ వుంటాను. చదువరుల సౌకర్యం కోసం!

10-02-1513
శ్రీకృష్ణ దేవరాయల చే కెంపులు, పచ్చలు, నీలాలు, మాణిక్యాలు, వైడూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్ర కిరీటం

02-05-1513  నవరత్నఖచిత ఉడుధార, స్వర్ణ ఖడ్గం, భుజకీర్తులు, 30 తీగల పతకం

తంజావూరు రాజు పాండ్యన్ ఓ కిరీటం

మైసూరు మహారాజు, తదితరులు--108 బంగారు పుష్పాలు, 32 కిలోల సహస్రనామహారం, నాలుగు కిలోల చతుర్భుజ లక్ష్మీ హారం, 7 కిలోల రత్నాల మకరకంఠి 13.6 కిలోల నవరత్న కిరీటం, 500 గ్రాముల అరుదైన గరుడ మేరు పచ్చ ఆభరణం

రతన్ టాటా, అంబానీలు, విజయ్ మాల్యా, గోయెంకా మొదలైనవారు--1940 లో వజ్ర కిరీటం, 1954 లో వజ్రాల హారం, 1972 లో వజ్రాల శంఖు చక్రాలు, కర్ణపత్రాలు, 1974 లో కటిహస్తం

1986 లో 5 కోట్ల విలువైన వజ్రాల కిరీటం తి.తి.దే వారు చేయించారు.

ఇప్పటికి మూలబేరానికి 8 కిరీటాలు, ఉత్సవ బేరాలకి 7 కిరీటాలు వున్నాయి.  

13-11-2008

ఆపోలో ఆస్పత్రుల అధిపతి శ్రీ ప్రతాప్ సి. రెడ్డి చేత, 5 కిలోల బరువూ, 80 లక్షల విలువా చేసే—అభయ, కటి హస్తాలు.

18-11-2008

తిరుపతి శాసన సభ్యులు వెంకటరమణ--పద్మావతి అమ్మవారికి--ఇరవై లక్షల విలువైన 2 కేజీల బంగారంతో తాపడం చేసిన 'అశ్వ వాహనం'

(ఇంతకు ముందు రెండు మూడు రోజుల క్రితం, ఇంకో కానుక యెవరో ఇచ్చారు గాని, వివరాలు వెదక లేక పోయాను—అందుకే, ఇదే మొదటి నమోదు!)

17-1-2009

—ఫాబ్ టెక్ కంపెనీ వారు రూ. ఒక కోటి విరాళం.
ఇంతకుముందు రూ. రెండు కోట్లు విరాళమిచ్చిన స్విస్ మహిళ ఎలిజబెత్ జెయిగ్లర్.

09-03-2009

--వీరెంద్ర మహేష్ గౌడ్ అనే ఆయన ముంబాయి నించి--51 లక్షల నగదు--అన్నదానం ట్రస్టు కోసం వినియోగిస్తామని ఈ వో ప్రకటన!

(ఈ మధ్యలో కొన్ని కానుకలు వచ్చాయి గానీ, వాటిని యెప్పటికప్పుడు ఇందులో చేర్చలేకపోయాను! మీకెవరికైనా తెలిస్తే, నాకుచెప్పెనాసరే, కామెంట్ లో వ్రాసినా సరే!--మీ యిష్టం)

11-06-2009--కర్ణాటక ఎమ్మెల్యే, ఇనుపఖనిజం ఫేం 'గాలి జనార్దన రెడ్డి ', 45 కోట్ల ఖర్చుతో, ఓ సరికొత్త బంగారు,వజ్ర కిరీటం!

25-07-2009--నవీన్ జిందాల్ దంపతులు--రూ.46 లక్షల విలువ చేసే బంగారు శంఖుచక్రాలు,తిరుచానూరు పద్మావతీ అమ్మవారుకి ఎస్ ఆర్ కన్నన్ అనే ఆయన రూ.1.50 లక్షల విలువ చేసే బంగారు హారం.

15-10-2009--ఎం పీ మేకపాటి రాజమోహన రెడ్డి, కుటుంబ సభ్యులూ--20.785 కిలోల బరువుగల, 3.69 కోట్లు ఖర్చైన 'స్వర్ణ పీతాంబరం'


19-10-2009--ఎన్ జె మోహన్ అనే భక్తుడు రూ.50 లక్షల విలువ చేసే బంగారు పళ్ళెం, రెండు దీపాలు, కర్పూరహారతి గెంటె, శ్రీ పద్మావతి అమ్మవారికి మాంగల్యం, బంగారు బిస్కెట్ మొదలైన పూజా సామాగ్రి


కీర్తి జోషి అనే భక్తుడు రూ.99 లక్షల విరాళం

26-10-2009--న్యూఢిల్లీ కి చెందిన ఓ భక్తుడు రూ. 3 కోట్ల విలువ చేసే 17 కిలోల బరువుగల, 50 లీటర్ల పరిమాణంతో, బంగారు గంగాళం


01-08-2009
న్యూఢిల్లీ కి చెందిన అజయ్ మోడీ దంపతులు ప్రతిపాదిత కంటి ఆస్పత్రి కోసం రూ. 50 లక్షలు విరాళం


{17-08-2009
 బెంగుళూరు నగరానికి చెందిన విమల తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం 16 లక్షల విలువైన 'కిలో బంగారాన్నీ 'అనంత స్వర్ణమయం' కోసం ఇచ్చారు.  ఇది శ్రీ వారి తరఫున 'ఆది కేశావుడి ' ముష్టి లో భాగం కాబట్టి, శ్రీ వారికి చెందని కానుక కాబట్టి అంత పెద్ద బ్రాకెట్టేశాను!}

{31-08-2009
మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి విజయ్వనిత్ తివారీ రెండు కిలోల బంగారాన్నీ, ఇంకో అఙ్ఞాత హైదరాబద్ భక్తుడు ఇంకో కీలో బంగారాన్నీ--'.........స్వర్ణమయం' కోసమే ఇచ్చారట.}

Saturday, October 3, 2009

శ్రీగిరి శ్రీపతి


శ్రీవారి ఆస్తులు


దేవాదాయశాఖ అధికారిక 'వెబ్ సైట్' నిన్న (02-10-2009) ప్రారంభించారట ముఖ్యమంత్రిగారు!  


ఆ సందర్భంగా--ఆస్తులు దురాక్రమణ కాకుండా, ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది అనీ, తి తి దే ఆస్తులని ప్రత్యేకంగా పరిరక్షించడానికి ఐ యే యస్ అధికారిని నియమించడానికి ప్రభుత్వం 'సానుకూలంగా' వుంది అనీ, దేవాలయాలకు ఆదాయాన్ని సమకూర్చే ఆస్తులు, ఆభరణాల వివరాలేవీ 'పధ్ధతి ప్రకారం' రికార్డులోకి యెక్కడం లేదు అనీ--ప్రకటించారట.  


రాష్ట్ర దేవాదాయ శాఖ అధీనంలో ప్రస్తుతం మొత్తం 4,30,033.19 యెకరాల భూమి వుందట, అందులో 34,813.37 యెకరాలు 'అన్యాక్రాంతం' అయ్యాయట.  


దేవాదాయ ఆస్తుల పరిరక్షణకోసం 'అంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్తు '--దేవాదాయశాఖ చైర్మన్ అధ్యక్షుడిగా, 'వివిధరంగాలలో నిష్ణాతులైన ' 21 మంది సభ్యులతో, ఐదుగురు ప్రత్యేక ఆహ్వానితులతో, దేవాదాయశాఖ కమిషనర్ కార్యదర్శిగా--యేర్పాటు చేసిందట.  


ఇక (తి తి దే కాకుండా) అన్ని దేవాలయాలలో కలిపి మొత్తం 1135 కిలోల బంగారం, 58,170 కిలోల వెండి వున్నాయట.  


ఆఖరుగా తి తి దే వద్ద కేవలం 1396 కిలోల బంగారం, 3,440 కిలోల వెండి, 2,180 కిలోల 'బంగారుపూత ' ఆభరణాలు మాత్రమే వున్నాయట!  


'నమ్మలేని నిజాల్లో' ఈ ఆఖరుది ప్రముఖ స్థానం ఆక్రమిస్తుందేమో--గిన్నిస్ రికార్డుకి యెక్కినా యెక్కొచ్చు! లేదా, 'రిప్లీ' వారు వారి 'నమ్ము-నమ్మకపో' లో చేర్చవచ్చునేమో!  


అదండీ సంగతి!



Wednesday, September 16, 2009

శ్రీగిరి శ్రీపతి....


సామాన్యుల, బ్లాగర్ల విజయం!


తనకొండకు తానే రప్పించుకొనే శ్రీవారు, తన దర్శనం సామాన్యులకి సులభం గా అయ్యేలాగ తానే పాలక మండలికి సద్బుధ్ధిని ప్రసాదించాడు!  


కీలక నిర్ణయాలు వెలువడ్డాయి.  


మొదటిది శ్రీవారి మూలబేరానికి వారానికోసారి చేస్తున్న సహస్ర కలశాభిషేకం రద్దు--(గతంలో లాగానే) యేడాదికొకసారే జరిపిస్తామని ప్రకటన.  


పరోక్షం గా వొప్పుకున్నారు--మూలబేరం అరిగిపోతోందనీ, రంగు మారిపోతోందనీ! సంతోషం!  


అష్టదళపద్మారాధనని కూడా సంపంగి ప్రాకారం లో జరిపిస్తామని--సామాన్యుల దర్శనానికి ఆ సమయం పెరుగుతుంది!  


రెండో ముఖ్యమైనది--సెల్లార్, అర్చనానంతర, నిజపాద దర్శనాల రద్దు! మధ్యలో వచ్చినవి మధ్యలోనే పొవాలి, పోతాయి! కదా!  


గతం లో లాగే శీఘ్ర దర్శనం టిక్కెట్ల అమ్మకం--రూ. 300/- కి ఒకటి చొప్పున. అదికూడా యేరోజుకారోజు దర్శనం సమయం లోనే విక్రయించడం! చాలా బాగుంది!  


మూడోది--సేవల పై కమిటీ నియామకం.  


మొత్తానికి మా మొన్నటి శ్రీపతి యాత్ర శుభమే కలిగించింది--సామాన్యులకి!  


మన టపాలు మనం లింకులు పంపినవాళ్ళందరూ--ముఖ్యం గా 'చదవలసినవాళ్ళు' చదివారు! ఖచ్చితం గా ఇది బ్లాగర్ల విజయమే!  


మనం కృతఙ్ఞతలు చెప్పవలసింది శ్రీ పీ వీ ఆర్ కే ప్రసాద్ గారికీ, ఇదివరకటి ఈ వో (ప్రస్తుత పాలక మండలి సభ్యుడు) శ్రీ రమణాచారి గారికీ, చివరగా మా జర్నలిష్ట్ మితృదు 'రమేష్' కీ!  


స్వామి ఇంకా సద్బుధ్ధిని ప్రసాదించి, ఇంకొన్ని కీలక నిర్ణయాలు కూడా త్వరలో ప్రకటించబడు గాక!



Sunday, September 13, 2009

స్వాములూ........


.......మాధవ సేవ!


మా సిబ్బంది అస్తమానూ మసిలే ఓ ప్రదేశం లో ఓ గోడమీద ప్రముఖం గా కనిపిస్తూ అంటించబడి వుంటుంది ఓ చిన్న బ్రోచర్--దానిమీద ఓ ప్రముఖ స్వామీజీ ఫోటో, ఆ ప్రక్కనే "మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ" అని వ్రాసి వుంటుంది--యెన్నేళ్ళక్రితం యెవరు అంటించారో!  


బుర్రలో మరేమీ ఆలోచనల్లేనప్పుడు, దాన్ని చూసి, 'ఈ స్వామికి చాతుర్మాస్య వ్రతాలూ, అనుగ్రహ సంభాషణలూ తప్ప, సేవ చెయ్యడానికి సమయం వుంటుందా? వున్నా చెయ్య నిస్తారా?' అనుకుంటూ వుండేవాణ్ణి మనసులో!  


33 కుటుంబాలకి సరిపోయేలా వసతి కల్పించడానికి నిర్మించబడ్డ, శిథిలమైపోయిన 'వేయికాళ్ళ మంటపాన్ని ' తొలగిస్తే, 'ఆగమ శాస్త్ర ప్రకారం దాన్ని అలాగే అక్కడే పునర్నిర్మించవలసిందే'--అంటూంటే, అనవసరం గా ఈయన యెందుకిలా ప్రవర్తిస్తాడు--అనుకొనేవాణ్ణి.  


ఆయనెవరో కాదు--మీరు వూహించే వుంటారు--శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయరు స్వామి!  


ఆయన విజయనగరం లోని జీయర్ ట్రస్ట్ నిధులతో, అంధ విద్యార్థులకోసం 'నేత్ర విద్యాలయాన్ని ' నిర్వహిస్తూ, దాన్ని జూనియర్ కాలేజ్ స్థాయికి పెంచి, విద్యార్థులకి 'ల్యాప్ టాప్' లు ఉచితం గా ఇచ్చి వారిచేత పరీక్షలు వ్రాయించడానికి బోర్డుని ఒప్పించి, వాళ్ళు ఉత్తీర్ణులయ్యేలా చేశారంటే--అంతకన్న మాధవ సేవ యేముంటుంది!  


స్వామీ! నమోవాకాలు!  


మిగిలిన గడ్డాల మీసాల కాషాయ స్వాములు కూడా--ఆశ్రమాలూ, గుళ్ళూ, గోపురాలూ, గీతా మందిరాలూ, ధ్యాన మందిరాలూ కట్టించడం మానేసి--ఇలాంటి మాధవ సేవకి పూనుకొంటే...............!  


ఆ విధం గా మనం ఆశిద్దామా?


Tuesday, September 1, 2009

శ్రీగిరి శ్రీపతి

ధర్మ దర్శనం


మొన్నీమధ్యనే, సామాన్యులకి దర్శన సమయం 23.5 గంటలు పెరిగే ప్రతిపాదనలకి, పాలక సభ్యులు 'ససేమిరా' అన్నారు!  


మళ్ళీ ఈ నెల మొదటివారం లో జరగబోయే పాలకమండలి సమావేశంలో 'కొన్ని కీలక నిర్ణయాలూ తీసుకోవచ్చట! 


వాటికి ప్రాతిపదిక--తి తి దే మాజీ కార్య నిర్వహణాధికారీ, ప్రస్తుత సలహా సంఘ సభ్యుడూ శ్రీ పీ వీ ఆర్ కే ప్రసాద్ ఇచ్చిన నివేదికట.  


ఆయన చెప్పిన (బుద్ధున్నవాడెవడైనా చెప్పే) విషయాలు--  


1. తోమాల, అర్చన సేవల్లో పాల్గొనేవాళ్ళు--కూర్చొని కాకుండా, నిలబడి వుంటే, ఆ సమయం లో దాదాపు 5 వేల మందికి దర్శనం కల్పించవచ్చుట.  


2. ఆర్జిత సేవలని తెల్లవారుజామున 3.30 నుంచి 6.30 లోపల పూర్తిచేసి, ఆ సమయం లోనే ప్రత్యేక దర్శనాలూ చేయించాలట.  


(ఆసలు, 'మునుపెప్పుడో పడవల్లో ప్రయాణించే రోజుల్లో.....' అన్నట్టు--కాటేజ్ ల అద్దెలూ, గెస్ట్ హౌస్ ల అద్దెలూ లాంటి శాశ్వతాదాయ మార్గాలు లేని రోజుల్లో, స్వామి వారి ఆదాయం పెంచడానికి ఈ సేవలని ప్రవేశ పెట్టారు--అప్పట్లో, వాటి రుసుములు 'అణాల్లోనే' వుండేవి--ఒక్క కళ్యాణానికి తప్ప! ఇప్పుడివన్నీ పూర్తిగా రద్దు చేస్తే యేడిచేవాడెవడు?)  


3. ధర్మ దర్శనాన్ని ఉదయం 6.30 నించి నిరాటంకంగా సాగించి, ప్రత్యేక సేవల పేరిట క్యూను నిలిపి వేయ వద్దు అనిట.  


4. సెల్లార్, అర్చనానంతర, తదితర దర్శనం టిక్కెట్లని రద్దు చెయ్యాలిట. (సెల్లార్ దర్శనం వొక్కటీ వుంచచ్చు--మిగిలినవి రద్దు చేసి--ఆ క్యూ వేస్ట్ అయిపోతుంది కదా? ఈ టిక్కెట్లని జారీ చేసే అధికారమంటూ యెవరికీ కట్టబెట్టకూడదు--కొనుక్కొనే వాళ్ళందరికీ--రోజుకి ఇన్ని అని అమ్మాలి--అంతే!)  


5. వీ ఐ పీ, వీ వీ ఐ పీ దర్శనాలకు నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలి--ఉదయం గంట, సాయంత్రం గంట! ఆ సమయం లోనే వారికి దర్శనం కల్పించాలిట.  


6. సోమవారం 'అష్టదళపద్మ ' సేవలూ, బుధవారం 'సహస్ర కలశాభిషేకాలూ' మూలవిరాట్టుకి కాకుండా ఉత్సవ బేరాలకి చేయిస్తే, అదనంగా 4-5 వేలమందికి దర్శనం దక్కుతుందట! (దీనివల్ల శ్రీ వారి మూలబేరం అరిగిపోవడం, రంగుమారడం లాంటివి జరక్కుండా వుంటాయి!)  


అన్నీ చక్కని సిఫార్సులే! మరి మండలి బాబులు (జనాలు తిట్టినా, ముఖ్య మంత్రి కళ్ళెర్రజేసినా చలించని చరిత్రగలవారు)యేంచేస్తారో--చూద్దాం!



శ్రీగిరి శ్రీపతి

డైరీ

తఱచుగా శ్రీవారికి భక్తులు సమర్పించే విలువైన కానుకల్ని తేదీలవారీగా ఈ డైరీలో అప్ డేట్ చేస్తూ వుంటాను. చదువరుల సౌకర్యం కోసం!

10-02-1513
శ్రీకృష్ణ దేవరాయల చే కెంపులు, పచ్చలు, నీలాలు, మాణిక్యాలు, వైడూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్ర కిరీటం

02-05-1513  నవరత్నఖచిత ఉడుధార, స్వర్ణ ఖడ్గం, భుజకీర్తులు, 30 తీగల పతకం
తంజావూరు రాజు పాండ్యన్ ఓ కిరీటం
మైసూరు మహారాజు, తదితరులు--108 బంగారు పుష్పాలు, 32 కిలోల సహస్రనామహారం, నాలుగు కిలోల చతుర్భుజ లక్ష్మీ హారం, 7 కిలోల రత్నాల మకరకంఠి 13.6 కిలోల నవరత్న కిరీటం, 500 గ్రాముల అరుదైన గరుడ మేరు పచ్చ ఆభరణం
రతన్ టాటా, అంబానీలు, విజయ్ మాల్యా, గోయెంకా మొదలైనవారు--1940 లో వజ్ర కిరీటం, 1954 లో వజ్రాల హారం, 1972 లో వజ్రాల శంఖు చక్రాలు, కర్ణపత్రాలు, 1974 లో కటిహస్తం
1986 లో 5 కోట్ల విలువైన వజ్రాల కిరీటం తి.తి.దే వారు చేయించారు.
ఇప్పటికి మూలబేరానికి 8 కిరీటాలు, ఉత్సవ బేరాలకి 7 కిరీటాలు వున్నాయి.  

13-11-2008

ఆపోలో ఆస్పత్రుల అధిపతి శ్రీ ప్రతాప్ సి. రెడ్డి చేత, 5 కిలోల బరువూ, 80 లక్షల విలువా చేసే—అభయ, కటి హస్తాలు.

18-11-2008

తిరుపతి శాసన సభ్యులు వెంకటరమణ--పద్మావతి అమ్మవారికి--ఇరవై లక్షల విలువైన 2 కేజీల బంగారంతో తాపడం చేసిన 'అశ్వ వాహనం'

(ఇంతకు ముందు రెండు మూడు రోజుల క్రితం, ఇంకో కానుక యెవరో ఇచ్చారు గాని, వివరాలు వెదక లేక పోయాను—అందుకే, ఇదే మొదటి నమోదు!)

17-1-2009

—ఫాబ్ టెక్ కంపెనీ వారు రూ. ఒక కోటి విరాళం.
ఇంతకుముందు రూ. రెండు కోట్లు విరాళమిచ్చిన స్విస్ మహిళ ఎలిజబెత్ జెయిగ్లర్.

09-03-2009

--వీరెంద్ర మహేష్ గౌడ్ అనే ఆయన ముంబాయి నించి--51 లక్షల నగదు--అన్నదానం ట్రస్టు కోసం వినియోగిస్తామని ఈ వో ప్రకటన!

(ఈ మధ్యలో కొన్ని కానుకలు వచ్చాయి గానీ, వాటిని యెప్పటికప్పుడు ఇందులో చేర్చలేకపోయాను! మీకెవరికైనా తెలిస్తే, నాకుచెప్పెనాసరే, కామెంట్ లో వ్రాసినా సరే!--మీ యిష్టం)

11-06-2009--కర్ణాటక ఎమ్మెల్యే, ఇనుపఖనిజం ఫేం 'గాలి జనార్దన రెడ్డి ', 45 కోట్ల ఖర్చుతో, ఓ సరికొత్త బంగారు,వజ్ర కిరీటం!

25-07-2009--నవీన్ జిందాల్ దంపతులు--రూ.46 లక్షల విలువ చేసే బంగారు శంఖుచక్రాలు,తిరుచానూరు పద్మావతీ అమ్మవారుకి ఎస్ ఆర్ కన్నన్ అనే ఆయన రూ.1.50 లక్షల విలువ చేసే బంగారు హారం.

15-10-2009--ఎం పీ మేకపాటి రాజమోహన రెడ్డి, కుటుంబ సభ్యులూ--20.785 కిలోల బరువుగల, 3.69 కోట్లు ఖర్చైన 'స్వర్ణ పీతాంబరం'

01-08-2009
న్యూఢిల్లీ కి చెందిన అజయ్ మోడీ దంపతులు ప్రతిపాదిత కంటి ఆస్పత్రి కోసం రూ. 50 లక్షలు విరాళం

{17-08-2009
 బెంగుళూరు నగరానికి చెందిన విమల తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం 16 లక్షల విలువైన 'కిలో బంగారాన్నీ 'అనంత స్వర్ణమయం' కోసం ఇచ్చారు.  ఇది శ్రీ వారి తరఫున 'ఆది కేశావుడి ' ముష్టి లో భాగం కాబట్టి, శ్రీ వారికి చెందని కానుక కాబట్టి అంత పెద్ద బ్రాకెట్టేశాను!}

{31-08-2009
మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి విజయ్వనిత్ తివారీ రెండు కిలోల బంగారాన్నీ, ఇంకో అఙ్ఞాత హైదరాబద్ భక్తుడు ఇంకో కీలో బంగారాన్నీ--'.........స్వర్ణమయం' కోసమే ఇచ్చారట.}

Monday, August 31, 2009

శ్రీగిరి శ్రీపతి....


స్వామి 'భక్తి చానెల్ '


విన్నారా? శ్రీవారి భక్తి చానెల్ 100 కోట్లకుపైగా నష్టాల్లో వుందట! 98 ధార్మిక సంస్థలకి కోట్లాది రూపాయలు ధారాదత్తం చేస్తోందట మన తి తి దే బోర్డు!  


గత 30 యేళ్ళుగా అందరికీ తెలిసున్నవే! యెన్ని ప్రభుత్వాలు వచ్చినా అన్నీ ఆ తానులో ముక్కలే! యెగబడి అన్నివూళ్ళలోనూ 'కళ్యాణ మండపాలు ' కట్టించేశారు! (వాటితో గుత్తదారులు బాగుపడ్డారు!) ఇప్పుడవన్నీ శిథిలావస్తలో వున్నాయి (కట్టుబడిలో అవినీతి మూలంగా)--నిర్వహణ సరిగ్గాలేక, ఇప్పుడు 'ప్రైవేటు 'కి అప్పగిస్తామన్నారు--టెండర్లు పిలిచారు! (ఇక్కడ ఇంకోరకం అవినీతి)  


యవడబ్బ సొమ్మని? (రాజుల సొమ్ము రాళ్ళపాలైనా, ఇప్పటికీ ఆ రాళ్ళైనా నిలిచి వున్నాయి--మరి దేవుడి సొమ్ము? పొట్టలు పెంచడానికా? ఆ పొట్టలు నిలుస్తాయా?)  


భక్తి చానెల్ మొదలెట్టే ముందు యేమి చెప్పారు? సినిమాలూ, సీరియళ్ళూ నిర్మిస్తాము--స్పాన్సర్లు వస్తారు--ఇన్ని కోట్ల లాభం వస్తుంది--పైగా స్వామికార్యం కూడా నెరవేరుతుంది--అని! మరిప్పుడు?  


చెపితే నవ్వుతారు (దేంతోనో మీ ఇష్టం!)  


క్రితం వార్షిక బ్రహ్మోత్సవాల్లో 'ప్రత్యక్ష వ్యాఖ్యానం' చేసిన ఓ ప్రముఖ వ్యక్తికి, పదమూడువందలో యెంతో (రెండువేల లోపు) చెక్కు ఇచ్చారు శ్రీ భక్తి చానెల్ వారు! తీరా ఆయన బ్యాంకుకి వెళ్ళి ఆ చెక్కుని తన ఖాతా లో జమ చేయమని అడిగితే--శ్రీ 'చానెల్ ' వారి ఖాతాలో వున్న సొమ్ము అక్షరాలా 'పందొమ్మిది రూపాయలు '! మరి ఖాతాలో సరిపడిన సొమ్ము లేకుండా చెక్కులు ఇవ్వడం నేరం! (దానిమీద ఆయన కోర్టుకి వెళ్ళలేదు--స్వామి భక్తుడు కాబట్టి!)  


మొన్న, పీ సీ సీ అధ్యక్షుడు శ్రీ ధర్మపురి శ్రీనివాస్ తన అనుచరులు కేవలం నలభయ్యే మందితో వెళితే, గంటన్నరపాటు క్యూలని ఆపేసి, రాజుగారినీ, వారి మంత్రులనీ సేవించడంలో సిబ్బంది తరించారట! పైగా, శ్రీ శ్రీనివాస్ 'వికలాంగుడు ' కాబట్టి, అది సమంజసమే అంటున్న ఆదికేశవుడు! {ఆయన వికలాంగుడనే ఇప్పటివరకు తెలియదు--యెలాంటి వికలాంగుడో యెవరికీ తెలియదు! పోనీ (ఆయనకి యేదో అంగం లోపించిందని) వొప్పుకున్నా, ఆ వెనక 40 మందికీ కూడా అవయవాలు లోపించాయా?}  


విలేఖరులు వచ్చేసరికి, సిబ్బంది పరుగులు పెట్టి, సెల్ ఫోన్లకి పని చెప్పి, వైకుంఠం 17 నించి--వైకుంఠం 1 కి భక్తులని పంపించమని హడావుడి చేశారట!  


నిజంగా మన మీడియా తలుచుకుంటే, ఓ క్రమ పద్ధతిలో వాళ్ళ సుకుమారమైన దున్నపోతుచర్మాలని వలిచెయ్యచ్చు!  


మన మీడియా అందుకు పూనుకుంటుందా?  


(అబ్బే! యెవరి సొంత ఎజెండాలు వాళ్ళకున్నాయి--అని యెవరో అంటున్నారు--అవునా?)  


యేమో!  


ఆ పైవాడికే తెలియాలి మరి!


తాజా కలం :-- శ్రీ వారి భక్తి చానెల్ ని (యెవరైనా తీసుకునేవాళ్ళుంటే), లీజుకి ఇచ్చేస్తారట! చూ. ఈనాడు సెప్టెంబరు 1, 2009--పే. 11



Thursday, August 27, 2009

రామస్వామి నగలు


బడాచోర్లు


‘….రెండుకాదు…11’ అంటోంది ఈనాడు!  


డి ఎస్పీ గంగరాజు, దర్యాప్తు అధికారి సీ ఐ సుధాకర్ రెడ్డి, విలేకర్ల సమావేశం లో ‘పదిహేనురోజుల క్రితం—3 లక్షలు చెల్లించి 3 నగలు పూజారి విడుదల చేయించినట్లు, వడ్డీ వ్యాపారి నుంచి 1.408 కేజీల బరువున్న 8 నగలు స్వాధీనం చేసుకొన్నట్లు, వాటిలో రెండు శుక్రవారమే స్వాధీనం చేసుకోగా, ఆరు శనివారం చేసుకున్నట్లు—డీ ఎస్పీ చెప్పగా, ఆర్చకుడి ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల హాజరుపరచలేకపోయామని పోలీసులూ—తెలిపారట.  


స్వాధీనం చేసుకున్నట్టు చెపుతున్న నగల్ని ప్రదర్శించకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ఇటీవల విడుదల చేయించిన నగలు భద్రం గా వున్నాయా అనే విషయం ఇంకా తేలాలట.  


మరి టీవీలో ఆ రాత్రి, 8 ఆభరణాలని స్వాధీనం చేసుకున్నారంటూ, అవేవో రంగు రంగుల రాళ్ళున్న ఆభరణాలని కొన్నింటిని చూపించారు! (బహుశా లైబ్రరీ షాట్లనుకుంటా!) మరి ఈ మీడియాల విశ్వసనీయత యేమిటి? యెవరి ఎజెండాలు వారికున్నాయనా?  


ఇక, డాలరు శేషాద్రి పేరు మొదటిసారి మొన్నీమధ్య కొండకి వెళ్ళినప్పుడు మా జర్నలిస్ట్ మిత్రుడి నించి విన్నాను. తరవాత మొన్న పేపర్లో చదవడమే! ఆయన్నెప్పుడూ చూడలేదు—ఒకవేళ గుడిలో చూశానేమో గానీ ఆయనే ‘ఫలానా’ అని తెలియదు.  


టీవీ లో ఆయన కళ్ళనీళ్ళతో, ‘నా జీవితమంతా రాత్రీ పగలూ స్వామివారికీ భక్తులకీ సేవ చెయ్యడానికే అంకితం చేశాను—బొక్కసం అంటే యేమిటో తెలియనివాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు—బొక్కసం లో గానీ, నాదగ్గరగానీ డాలర్లు వుండవు—నాకు పిల్లలు లేరు—స్వంత ఇల్లు కూడా కట్టుకోకుండా నా భార్యతో అద్దె ఇంట్లో వుంటున్నాను—యెవరికోసం సంపాదించాలి—అదీ అవినీతితో!’ అని వాపోతుంటే, నిజం చెప్పొద్దూ—హృదయం ద్రవించింది!  


వారెన్ బఫెట్ ‘నా సంతానం రోడ్డున పడక్కర్లేనంత మాత్రమే వాళ్ళకి ఇచ్చి, మిగిలినదంతా సేవా సంస్థకి ఇచ్చేస్తున్నాను’ అని ప్రకటించాడు ఇదివరకు.  


మరి మన టాటా, బిర్లా, అంబానీలూ, బచ్చన్లూ, రెడ్డిలూ యెందుకు ఆలోచించరో!  


శ్రీ శేషాద్రి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం వీరందరికీ, మీడియాకీ లేదా?



Saturday, August 22, 2009

కూష్మాండాలు కుక్కబడతాయా?

మారణహోమమా?
పాపం….మహాయోగి రామకృష్ణ పరమహంస లా వున్నాడు చూడడానికి!
ఆ ముఖం చూస్తే, 8 లక్షలు—పెళ్ళిళ్ళకీ, అనారోగ్యానికీ అయితే మాత్రం—ఖర్చుపెట్టగలదిగా కనిపిస్తోందా?
2007 లో కనీసం 11 లక్షల విలువచేసే నగలు పట్టుకెళ్ళి తాకట్టు పెడతానంటే, అవి ఆయన స్వంతమే అని యెవరైనా నమ్మేటట్టుందా?
అసలు తాకట్టు యెందుకు—యే చిత్తూరో, చెన్నయ్యో తీసుకెళ్ళి అమ్మేస్తే పోలా—అనే అలోచనైనా వచ్చే తెలివి కనిపిస్తోందా?
ఆయనెవరంటారా!
శ్రీపతి పట్టణం లోని కోదండ రామస్వామి ఆలయం ప్రధానార్చకుడు శ్రీ చిన్న వెంకటరమణ దీక్షితులు!
ఆలయ మూల విగ్రహం మీద వుండే నగలని తాకట్టు పెట్టాడనే అరోపణమీద ఆయననీ, ఆయన భార్యనీ కూడా ‘అరెష్టు’ చేశారట!
ఆయనే తాకట్టు పెట్టినట్టు వొప్పుకోవడం, ఫలానా బంగారం షాపు యజమాని కొడుకు దాన్ని ధృవీకరించడం, అరెష్టులూ, టీవీల్లో వార్తలూ, పేపర్లకి వార్తలూ వచ్చేశాయట!
కొన్ని ప్రశ్నలు---
కొండమీది శ్రీవారినే, ఆభరణరహితం గా వారానికి ఓ రోజు దర్శనానికి అనుమతిస్తూండగా, రామాలయం లో 11 లక్షల విలువైన ఆభరణాలని 2007 వరకూ 365 రోజులూ అలంకరించే వుంచేవారా?
2007 లో కొన్నాళ్ళు 6 లక్షల విలువైన ఆభరణం ఒకటే వుండి, రెండోది కనిపించక పోయినా, యెవరికీ అనుమానం రాలేదా?
ఆ తరవాతైనా రెండూ లేనప్పుడు కూడా రాలేదా?
అనుమానం రాకుండా ఆయనేమయినా అలాంటివే గిల్టు నగలు తయారుచేయించి అలంకరించాడా?
కోదండ రాముడికి 47 రకాల స్వర్ణాభరణాలూ, 600 కిలోలకి పైబడి వెండి ఆభరణాలూ 70 కిలోల వరకూ వెండి కవచాలూ వున్నాయట. అవన్నీ ఒక చోట వుండి వుంటాయి కదా? గత రెండు సంవత్సరాల్లో అవేవీ స్వామికి అలంకరించలేదా? ఒకవేళ అలంకరిస్తే, మళ్ళీ అవి భద్రపరచబడాలికదా? అది దేవస్థానం వుద్యోగుల పనేగా? వాళ్ళెవరికీ అనుమానం రాలేదా?
‘పారుపత్తేదారు’ అంటే శ్రీవారి బొక్కసానికి సంబంధించిన ‘గుమాస్తా’ ట. ఆ పదవీ విరమణ చేసినాయన శ్రీ పి శేషాద్రి అట. (ఆయన్నే డాలరు శేషాద్రి అంటారట--మరి ఆయన ఇప్పుడు పొడిగింపు మీద ప్రత్యేకాధికారిగా కొనసాగుతున్నారట!) పదవీ విరమణ చేశాక కూడా, శ్రీవారి బొక్కసం తెరవగల ‘రెండు’ తాళాలూ ఆయనదగ్గరే వుంటున్నాయట. బొక్కసం నించి 300 బంగారు డాలర్లు మాయం అయ్యాయట.
ఈ విషయాలన్నీ నిఘా, భద్రతాధికారి శ్రీ బి వి రమణ కుమార్ క్షుణ్ణం గా పరిశీలించి తీసుకోవలసిన చర్యల్ని సూచిస్తూ, 2008 లోనే నివేదిక సమర్పించారట!
‘……యేమడిగారూ?.......అరెష్టా! ఇంకా నయం—ఆయనేమయినా ఓ పిచ్చి అర్చకుడా—భార్యా సమేతం గా అరెష్టుకీ, వుద్యోగం పీకెయ్యడానికీ……’ అంటున్నారెవరో!
మరి ఇవన్నీ గమనిస్తే, మొదలైన మారణహోమం లో ఇంకా చాలామంది సమిధలవుతారేమోనని నాకొచ్చిన ఆలోచన తప్పని యెవరైనా అనగలరా?
నడుస్తున్నది ‘దేవుడి’ పాలన అంటున్నారు మరి.

Friday, August 21, 2009

శ్రీగిరి శ్రీపతి

శ్రీ వారికోసం.....బంగారు ముష్టి
శ్రీ డీ కే ఆదికేశవులు నాయుడు శ్రీగిరి శ్రిపతి దేవస్థానం (ప్రస్తుత తి తి దే) పాలకవర్గ చైర్మన్ అయ్యాక ప్రవేశపెట్టిన ‘వినూత్న’ పథకం—“శ్రీవారి……..! అనంత స్వర్ణమయం!” అనే శ్రీవారి బంగారు ముష్టి కార్యక్రమం.
ఈ పథకం ప్రకారం, శ్రీవారి గుడి లోపల గోడలనీ, స్థంభాలనీ, బంగారం తో తాపడం చేయిస్తారట! (ఆ క్రమం లో శిల్ప కళ దెబ్బతినకుండా, పలచగానే పామిస్తామని కూడా హామీ ఇచ్చారు!) దానికి ఓ 35 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట! అందుకోసం అందరూ విరివిగా బంగారం విరాళం ఇవ్వండి! అని ఆయన విఙ్ఞప్తి చేశారు!
ఆ తరవాత కొన్నాళ్ళకే ‘అంచనా వ్యవం 48 కోట్లకో యెంతకో చేరిపోవడం చేత, ఇంకా విరివిగా విరాళాలు ఇవ్వండి—అన్నారు!
ఇక చూసుకోండి—చెన్నై లోనూ, బెంగుళూరులోనూ, చిత్తూరు నించి నెల్లూరు—గుంటూరు మీదుగా మిగిలిన జిల్లాలలోనూ—వీర వసూళ్ళు మొదలయ్యాయట! దీనికేమైనా లెఖ్ఖా పత్రమా? ప్రతీవాడూ ‘ఫలానా కార్యక్రమం కోసం’ బంగారం ముష్టి అడిగేవాడే! వసూలు చేశేవాడే! (వాళ్ళల్లో చాలా మంది ‘ఆది కేశవుడి’ మనుషులే అని కూడా చెవులు కొరుక్కున్నారు!
తరవాత ‘ఆది కేశవుడు’ వాళ్ళని కోప్పడ్డాడు—‘మేమెవ్వరికీ అలా వసూలు చెయ్యమని అధికారం ఇవ్వలేదు’—అంటూ!
అప్పుడే నా బ్లాగులో ఈ ప్రశ్న లేవనెత్తాను—శ్రీవారికి ముష్టి యెత్తాల్సిన ఖర్మ యేమిటి? అని.
ఆయనకి గత 500 సంవత్సరాలుగా వస్తున్న బంగారు మొక్కుబడులూ, బహుమతులూ (వాటిలో దిగమింగినవాళ్ళు మింగెయ్యగా మిగిలినవైనా) చాలకనా?
1980 లలో అనుకుంటా, శ్రీవారికి వచ్చిన కానుకలు బస్తాలకొద్దీ పోగుబడిపోతే, దేవస్థానం వాళ్ళు, ప్రభుత్వ అనుమతితో, ఆ బంగారాన్ని కరిగించి, ఇటుకలుగా పోత పోయించి, వాటిలోని పెద్ద పెద్ద రాళ్ళనీ, వజ్రాలనీ వేరుగా, చిన్న చిన్న రాళ్ళని వేరుగా చేసి, ముంబాయిలో వేలం వేశారు! ఆ ఇటుకల్ని ఓ బ్యాంకులాకరులో భద్రపరిచారు—ముంబాయి లోనే!
మరి ఆ బంగారమంతా యేమయినట్టు? ఆ తరవాత వచ్చినవాటి మాటేమిటి?
ఈ రోజున హైకోర్టు అడిగితేనే, జాబితా ఇవ్వడానికి 2 నెలలు సమయం అడిగారు—పైగా సిగ్గులేకుండా ‘రహస్య విచారణ’ జరిపించమంటున్నారు!
ఇవన్నీ చూసికూడా, ఆదికేశవుడి ముష్టి పథకం శ్రీ వారికే చెందుతుంది అంటారా? అందుకే అంత పెద్ద బ్రాకెట్టేశాను!
ఓ నా హిందూ సోదరులారా—ఆ జాబితాల్నీ, ఇంటి, బయటి, రాజకీయ, అరాచకీయ దొంగల్నీ బయట పెట్టిస్తారా—యెవడి పాపానికి వాడే పోతాడు అని వూరుకుందామా?
ఆలోచించండి!

Wednesday, August 19, 2009

శ్రీగిరి శ్రీపతి

డైరీ

తఱచుగా శ్రీవారికి భక్తులు సమర్పించే విలువైన కానుకల్ని తేదీలవారీగా ఈ డైరీలో అప్ డేట్ చేస్తూ వుంటాను. చదువరుల సౌకర్యం కోసం! 10-02-1513

శ్రీకృష్ణ దేవరాయల చే కెంపులు, పచ్చలు, నీలాలు, మాణిక్యాలు, వైడూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్ర కిరీటం

02-05-1513 నవరత్నఖచిత ఉడుధార, స్వర్ణ ఖడ్గం, భుజకీర్తులు, 30 తీగల పతకం

తంజావూరు రాజు పాండ్యన్ ఓ కిరీటం

మైసూరు మహారాజు, తదితరులు--108 బంగారు పుష్పాలు, 32 కిలోల సహస్రనామహారం, నాలుగు కిలోల చతుర్భుజ లక్ష్మీ హారం, 7 కిలోల రత్నాల మకరకంఠి 13.6 కిలోల నవరత్న కిరీటం, 500 గ్రాముల అరుదైన గరుడ మేరు పచ్చ ఆభరణం

రతన్ టాటా, అంబానీలు, విజయ్ మాల్యా, గోయెంకా మొదలైనవారు--1940 లో వజ్ర కిరీటం, 1954 లో వజ్రాల హారం, 1972 లో వజ్రాల శంఖు చక్రాలు, కర్ణపత్రాలు, 1974 లో కటిహస్తం

1986 లో 5 కోట్ల విలువైన వజ్రాల కిరీటం తి.తి.దే వారు చేయించారు.

ఇప్పటికి మూలబేరానికి 8 కిరీటాలు, ఉత్సవ బేరాలకి 7 కిరీటాలు వున్నాయి.

13-11-2008

ఆపోలో ఆస్పత్రుల అధిపతి శ్రీ ప్రతాప్ సి. రెడ్డి చేత, 5 కిలోల బరువూ, 80 లక్షల విలువా చేసేఅభయ, కటి హస్తాలు. 18-11-2008 తిరుపతి శాసన సభ్యులు వెంకటరమణ--పద్మావతి అమ్మవారికి--ఇరవై లక్షల విలువైన 2 కేజీల బంగారంతో తాపడం చేసిన 'అశ్వ వాహనం' (ఇంతకు ముందు రెండు మూడు రోజుల క్రితం, ఇంకో కానుక యెవరో ఇచ్చారు గాని, వివరాలు వెదక లేక పోయానుఅందుకే, ఇదే మొదటి నమోదు!) 17-1-2009ఫాబ్ టెక్ కంపెనీ వారు రూ. ఒక కోటి విరాళం. ఇంతకుముందు రూ. రెండు కోట్లు విరాళమిచ్చిన స్విస్ మహిళ ఎలిజబెత్ జెయిగ్లర్. 09-03-2009 --వీరెంద్ర మహేష్ గౌడ్ అనే ఆయన ముంబాయి నించి--51 లక్షల నగదు--అన్నదానం ట్రస్టు కోసం వినియోగిస్తామని ఈ వో ప్రకటన! (ఈ మధ్యలో కొన్ని కానుకలు వచ్చాయి గానీ, వాటిని యెప్పటికప్పుడు ఇందులో చేర్చలేకపోయాను! మీకెవరికైనా తెలిస్తే, నాకుచెప్పెనాసరే, కామెంట్ లో వ్రాసినా సరే!--మీ యిష్టం) 11-06-2009--కర్ణాటక ఎమ్మెల్యే, ఇనుపఖనిజం ఫేం 'గాలి జనార్దన రెడ్డి ', 45 కోట్ల ఖర్చుతో, ఓ సరికొత్త బంగారు,వజ్ర కిరీటం!

25-07-2009--నవీన్ జిందాల్ దంపతులు--రూ.46 లక్షల విలువ చేసే బంగారు శంఖుచక్రాలు,తిరుచానూరు పద్మావతీ అమ్మవారుకి ఎస్ ఆర్ కన్నన్ అనే ఆయన రూ.1.50 లక్షల విలువ చేసే బంగారు హారం.

01-08-2009

న్యూఢిల్లీ కి చెందిన అజయ్ మోడీ దంపతులు ప్రతిపాదిత కంటి ఆస్పత్రి కోసం రూ. 50 లక్షలు విరాళం

{17-08-2009

బెంగుళూరు నగరానికి చెందిన విమల తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం 16 లక్షల విలువైన 'కిలో బంగారాన్నీ 'అనంత స్వర్ణమయం' కోసం ఇచ్చారు. ఇది శ్రీ వారి తరఫున 'ఆది కేశావుడి ' ముష్టి లో భాగం కాబట్టి, శ్రీ వారికి చెందని కానుక కాబట్టి అంత పెద్ద బ్రాకెట్టేశాను!}

Sunday, August 16, 2009

గోవిందా....!

వీ పీ లకి బ్రేక్
మొన్న శుక్రవారం (14-08-2009) మధ్యాన్నం నించి విపరీతం గా వర్షం కురిసి, శ్రీవారి ఆలయం లో రెండడుగుల లోతున నీరు నిలిచి, దాన్ని తొలగించడానికి దేవస్థానం వారు అష్టకష్టాలు పడ్డారట. భక్తులు తీవ్ర ఇక్కట్లు యెదుర్కొన్నారట.
అదలా వుంటే, రాష్ట్ర మంత్రివర్యుడు ఎం. ముఖేష్ గౌడ్, ఓ నలభై అయిదు మంది పరివారం తో వచ్చి పడ్డాడట!
భక్తుల రద్దీ కారణం గా రాత్రికి వీ ఐ పీ బ్రేక్ దర్శనం వుండదని, శనివారం ఉదయం స్వామి దర్శనం చేసుకోవాలని తితిదే అధికారులు తేల్చి చెప్పారట.
అంగీకరించినట్లే వుండి, ఆఖరికి తమకు రాత్రి బ్రేక్ దర్శనం కావాల్సిందేనని మంత్రి పట్టుబట్టారట! విధిలేని పరిస్థిలో అధికారులు మంత్రి కోసం, వాడి పరివారం కోసం, వీ ఐ పీ బ్రేక్ దర్శనం యేర్పాటు చేశారట!
ఇలా ముఖేష్ లాంటి ఎల్ కే అద్వానీలని భక్తులు తన్ని తగిలేసే రోజు యెప్పుడొస్తుందో!

Friday, August 14, 2009

శ్రీ కృష్ణపరమాత్మా!

………మరే!
కృష్ణాష్టమి సందర్భంగా మన ఎలక్ట్రానిక్ మీడియా—శ్రీ కృష్ణుడు ‘ఉత్తముండ ' గు మేనేజిమెంటు గురు’; ‘మార్కెటింగు గురు’; అన్ని కులాలనీ ప్రేమించే ‘సమానత్వ గురు’; ‘మానవ వనరుల అభివృద్ధి గురు’ ఇలా పేలుతూ, ‘కృష్ణుడి గుడి అంటే ఇస్కాన్ గుడే’ అన్నట్టు గుర్తింపు వచ్చింది’ అంటున్నప్పుడు—నా అభిప్రాయం వ్రాయాలనిపించింది!
మా అమ్మాయి బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా వుద్యోగం చేస్తూండగా (అప్పటికింకా పెళ్ళి చెయ్యలేదు) పోరు పెడుతుంటే, రెండోసారి మహబూబ్ నగర్ నించి బెంగుళూరు వెళ్ళాము—మా కారులో!
{మొదటి సారి—నా అలవాటు ప్రకారం—ట్రెయినులో వెళ్ళి, గవర్నమెంటువారి టూరిజం బస్సుల్లో సిటీ సైట్ సీయింగ్ చేసెయ్యడం, చూడవలసిన (గుళ్ళూ గోపురాలూ తప్ప) ప్రదేశాలని గుర్తుంచుకోవడం—(మళ్ళీ వెళ్ళినప్పుడు తీరికగా చూడడానికి)—అయిపోయింది--ఈ విధం గా మనదేశం లోని--కొలకత్తా తప్ప--అన్ని మహానగరాలూ, ఇతర కొన్ని పెద్ద పట్టణాలూ తిరిగేశాము!}
ఓ ఆదివారం, ఇస్కాన్ కి వెళ్ళాము (దాన్ని నేను గుడిగా గుర్తించలేదు--పర్యాటక కేంద్రం గా తప్ప).
క్యూలో వెళుతున్నాము—ముందు మా అమ్మాయి, వెనుక మా ఆవిడ, మధ్యలో నేను—ఒక చోట ఇరవై ఒకటో, నూట యెనిమిదో చిన్న చిన్న తిన్నెల లాంటివి వుంటాయి—‘హరేరామ హరేరామ రామ రామ హరే హరే! హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే’ అని మైకుల్లోంచి వినపడుతూ వుంటుంది—మనం కూడా, ఒక్కో తిన్నె మీదా నిలబడి, అలాగే ఇరవయ్యొక్క సార్లో, నూట యెనిమిది సార్లో అంటూ వెళ్ళాలన్నమాట!
సరే, నేను నోరు మూసుకుని, మనసులో నవ్వుకుంటూ ఒక్కొక్క తిన్నెనీ దాటుతున్నాను—మిగిలినవాళ్ళందరూ తూ.చ. తప్పకుండా ఆఙ్ఞల్ని పాటిస్తున్నారు.
ఇంతలో, యెదురుగా ఓ బాల్కనీ లాంటి చోట ప్రత్యక్షమయ్యాడొకడు—ఖాకీ నిక్కరూ, కాషాయరంగు లాల్చీ, గుండూ, ఓ రెండు మూడు మిల్లీమీటర్ల అప్పుడప్పుడే మొలుస్తున్న జుట్టుతో, లావుగా—పరేష్ రావల్ లాంటి గుండ్రని గుమ్మడికాయ ముఖంతో—యాక్షన్ చేస్తున్నాడు—గుప్పెళ్ళు బిగించి, ముందునించి నెత్తిపైకి చేతులు బలవంతంగా లాగుతున్నట్టు అభినయిస్తూ, శబ్దం రాకుండా—కమాన్, కమాన్, అనండి—హరేరామ………ఇలా యాక్షన్ చేస్తూ!
నన్ను గమనించనే గమనించాడు—నేను పెదాలు కదపక పోవడం, నవ్వుకుంటూండడం గమనించి, నన్ను చూస్తూ మరింత రెచ్చిపోతున్నాడు!
నాకూ సరదా పుట్టింది—చాలా నెమ్మదిగా మొదలుపెట్టాను—హరే అల్లా హరే అల్లా అల్లా అల్లా హరే హరే! హరే క్రీస్తు హరే క్రీస్తు క్రీస్తు క్రీస్తు హరే హరే—అంటూ!
మొదట మా అమ్మాయి—‘డాడీ!’ అంటూ! తరవాత కుడి, యెడమ పక్కవాళ్ళు—‘హా’ అనే ఎక్స్ప్రెషన్లతో! వెనక నించి మా ఆవిడ ‘యెందుకండీ అలాగ!’ అంటూ!
మళ్ళీ నోరు మూశేశాను. పైనున్నవాడికివేమీ తెలియదుకదా? ముఖం కందగడ్డలా చేస్కొని వెళ్ళిపోయాడు!
భక్తి అన్నది మనసులోంచి రావాలి గానీ, ఈ బలవంతపు బ్రాహ్మణార్ధాలేమిటీ?