Saturday, October 3, 2009

శ్రీగిరి శ్రీపతి


శ్రీవారి ఆస్తులు


దేవాదాయశాఖ అధికారిక 'వెబ్ సైట్' నిన్న (02-10-2009) ప్రారంభించారట ముఖ్యమంత్రిగారు!  


ఆ సందర్భంగా--ఆస్తులు దురాక్రమణ కాకుండా, ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది అనీ, తి తి దే ఆస్తులని ప్రత్యేకంగా పరిరక్షించడానికి ఐ యే యస్ అధికారిని నియమించడానికి ప్రభుత్వం 'సానుకూలంగా' వుంది అనీ, దేవాలయాలకు ఆదాయాన్ని సమకూర్చే ఆస్తులు, ఆభరణాల వివరాలేవీ 'పధ్ధతి ప్రకారం' రికార్డులోకి యెక్కడం లేదు అనీ--ప్రకటించారట.  


రాష్ట్ర దేవాదాయ శాఖ అధీనంలో ప్రస్తుతం మొత్తం 4,30,033.19 యెకరాల భూమి వుందట, అందులో 34,813.37 యెకరాలు 'అన్యాక్రాంతం' అయ్యాయట.  


దేవాదాయ ఆస్తుల పరిరక్షణకోసం 'అంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్తు '--దేవాదాయశాఖ చైర్మన్ అధ్యక్షుడిగా, 'వివిధరంగాలలో నిష్ణాతులైన ' 21 మంది సభ్యులతో, ఐదుగురు ప్రత్యేక ఆహ్వానితులతో, దేవాదాయశాఖ కమిషనర్ కార్యదర్శిగా--యేర్పాటు చేసిందట.  


ఇక (తి తి దే కాకుండా) అన్ని దేవాలయాలలో కలిపి మొత్తం 1135 కిలోల బంగారం, 58,170 కిలోల వెండి వున్నాయట.  


ఆఖరుగా తి తి దే వద్ద కేవలం 1396 కిలోల బంగారం, 3,440 కిలోల వెండి, 2,180 కిలోల 'బంగారుపూత ' ఆభరణాలు మాత్రమే వున్నాయట!  


'నమ్మలేని నిజాల్లో' ఈ ఆఖరుది ప్రముఖ స్థానం ఆక్రమిస్తుందేమో--గిన్నిస్ రికార్డుకి యెక్కినా యెక్కొచ్చు! లేదా, 'రిప్లీ' వారు వారి 'నమ్ము-నమ్మకపో' లో చేర్చవచ్చునేమో!  


అదండీ సంగతి!



No comments: