Thursday, October 29, 2009

శ్రీగిరి శ్రీపతి


దర్శనాలు, సేవలు


రూ.600 ల శీఘ్ర దర్శనం అమల్లోకి వచ్చింది! మొదటిరోజు అస్తవ్యస్తంగా నడిచిందట--యెవరిని ముందు, యెవరిని వెనక అనే మీమాంసలతో!  


ఇక సేవల విషయం లో కమిటీ యేమీ తేల్చలేదు--త్వరలో తేల్చవచ్చట.  


సుప్రభాత, తోమాల సేవల రుసుము సుమారు 200 కావడంతో, దీన్ని పెంచాలని ఆలోచిస్తున్నారని వినికిడి. ఈ సేవల టిక్కెట్లు కొనుక్కున్నవాళ్ళు, కనీసం ఓ గంటసేపు స్వామి సన్నిధిలో వుండిపోతారట.  


ఇప్పుడు తెల్లవారుజామున 4.30 నించీ, రాత్రి 2.30 వరకూ, 22 గంటల్లో, మహాలఘు దర్శనం తో దాదాపు 80 వేలమందికి దర్శనం కలిగించేస్తున్నారు! అంటే స్వామి అలంకారానికీ, భోగానికీ, సేవలకీ ఓ నాలుగు గంటలు మినహాయించినా, 64800 సెకన్లలో, సెకనుకి సుమారు ఒకటింపావు మంది దర్శనం చేసుకుంటున్నారు! 


ఈ లెఖ్ఖన, రూ.600 శీఘ్రదర్శనం వాళ్ళుకూడ సెకనుకి ఒకటింపావు మంది మాత్రమే డర్శనం చేసుకోగలరు కదా (సెకనుకి దర్శనం ఖరీదు రూ.750/-!), మరి సేవల పేరుచెప్పి కనీసం గంట వుండేవాళ్ళ ఒక్కొక్కళ్ళ దగ్గరనించి 3600 సెకన్లకి, సెకనుకి రూ.750/- చొప్పున యెంత వసూలు చెయ్యాలి? (ఓ వందమంది ఆ సేవల టిక్కెట్లు కొన్నారనుకున్నా, ఒక్కొక్కళ్ళూ రూ.27000/- చెల్లించాలి!  


ఈ లెఖ్ఖలు మానేసి, ఈ సేవలన్నీ రద్దు చేస్తే, 'మహా' లేని 'లఘు' తోటే 80 వేలమంది దర్శనాలు చేసుకోవచ్చుకదా?  


తి తి దే ఆర్థికవేత్తలు యేమంటారో!  


ఇంకో ముఖ్యమైన విషయం--శీఘ్ర దర్శనం వాళ్ళూ, ఉచిత/టిక్కెట్టు సుదర్శనం వాళ్ళూ, చంటిబిడ్డ తల్లిదండ్రులూ, సన్నిధిలో వివాహం చేసుకున్న జంటలూ, వాళ్ళతోపాటు నలుగురో యెంతమందో, కాలినడకన కొండ యెక్కేవాళ్ళూ--ఇలా అందర్నీ 'మహర్ద్వారం' దగ్గర నించి ఒకే క్యూలో కలిపేసి, తోసుకుంటూ బంగారువాకిలి వరకూ పొమ్మనడాన్ని నివారించడానికి ఓ కమిటీనెందుకు వెయ్యరు?  


ఇది శ్రీవారి భక్తులందరి తరఫునా నా ప్రధాన 'డిమాండ్'. నెరవేర్చవలసిందే!  


పైగా, ఈ వో గారు--చంటిబిడ్డ తల్లులకొక్కళ్ళకే అనుమతిస్తే వాళ్ళు నలిగిపోతారని, వాళ్ళ భర్తలకి కూడా ప్రవేశం కల్పిస్తే, చైర్మన్ ఆదికేశవుడు దానికి మొదటినించీ వ్యతిరేకమేనట! 


మరి వాడి లెఖ్ఖలేమిటో!  


('డైరీ' కూడా అప్ డేట్ అయ్యింది. చదవండి)

No comments: