Monday, November 30, 2009

శ్రీగిరి శ్రీపతి

నిర్మాణాలు, కేటాయింపులు

“నిత్యం వివాహాలు చేసుకొనేందుకు వీలుగా, ‘కేంద్రీకృత కల్యాణ వేదిక’ నిర్మించాలని పాలక మండలి నిర్ణయించి, వాళ్ళ ఇంజనీరింగు విభాగానికి అనుమతి” ఇచ్చిందట.
“పురోహిత సంఘాన్ని కూడా కల్యాణవేదిక వద్దకు” మార్పు చేస్తారట.
(ఇన్నాళ్ళూ వివాహాలు యెక్కడ యెలా జరుగుతున్నాయో, పురోహిత సంఘం యెక్కడ వుందో—వీటివల్ల ఇబ్బందులేమైనా వున్నాయో నాకైతే తెలియదు—తెలిసున్నవాళ్ళు చెపితే సంతోషం!)
అయినా యెందుకు వ్రాస్తున్నానంటే, ‘నిర్మాణాలు‘ అనేప్పటికల్లా, యెందుకంత ‘శీఘ్రం గా’ నిర్ణయాలూ, అనుమతులూ జరిగిపోతాయో అని నా అనుమానం! (శుభ్రం గా ఇసుకా, సిమెంటూ, కంకరా భోంచెయ్యచ్చనా అని సందేహం!)
ఇక, “వరదలకారణం గా నష్టపోయిన ఆలయలకు ఆర్థిక సహాయం” చేస్తారట! బాగుంది.
మరి, ఈ పేరుతో, మొదట ‘మంత్రాలయం’ లో అభివృధ్ధి పనులకోసం, 5 కోట్లు యెందుకు కేటాయించాలి? 

అదేమీ పురాతన హిందూ దేవాలయం కాదే? పైగా రాఘవేంద్రస్వామి కి వుండే భక్తులు ఆయనకి వున్నారు—ఆ మఠం ప్రస్తుత స్వామిని, వరదలు మొదలయ్యేలోపల, హెలికాప్టరులో సురక్షిత స్థానానికి తరలించారు కదా? మరి ఆ సంస్థ అంత బీద స్థితిలో వుందనా ఈ గొరిగింపు? (ఈ వంకని ‘సిఫార్సు’ చెయ్యబడ్డ అడ్డమైన గుడికీ కేటాయింపులు చేసుకోవచ్చనేమో అని నా అనుమానం!)
పైగా, కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణాలయం లో ‘అన్న బ్రహ్మ’ (ఈ బ్రహ్మెవరో!) పథకాన్ని ఆదివారం (29-11-2009) న ఆదికేశవుడు ప్రారంభిస్తాడట.
అన్నవరం సత్యదేవుడితో మొదలెట్టి, జంగారెడ్డిగూడెం దగ్గర ‘గోకుల తిరుమల పారిజాత గిరి’ మీది స్వామి వరకూ, వాళ్ళ వాళ్ళ ‘నిరతాన్నదాన’ పథకాలు ప్రవేశపెట్టుకున్నారు! ప్రతీ వీధి చివరి గుడీ, పర్వదినాల్లో ‘అన్న సంతర్పణలు’ చేస్తున్నాయి! మరి ఉడిపి స్వామి కేమి దొబ్బుడాయి?
ఇవన్నీ మారాలంటారా, వద్దా?

No comments: