Thursday, November 5, 2009

శ్రీగిరి శ్రీపతి


ఆభరణాల లెఖ్ఖలు

అనుకున్నంతా అయ్యింది! కోర్టువారికి తి తి దే వారు శ్రీ వారి ఆభరణాల విలువ కేవలం రూ. 52 కోట్లే (52 వేల కోట్లు కాదు) అని చెప్పారట!  


అలా యెందుకంటే, 'అప్పటి లెఖ్ఖల ప్రకారమే మేము కూడికలూ, తీసివేతలూ చెయ్యగలం గానీ, హెచ్చవేతలూ అవీ మాకు రావు కదండీ' అంటున్నారట!  


ఉదాహరణకి శ్రీ కృష్ణదేవరాయలు చేయించిన వజ్రకిరీటం విలువ ఆ రోజుల్లో అర్థనూట పదహార్లు అనుకుందాం--దాంట్లో బంగారం ఓ 30 రూపాయలూ, మిగిలిన కెంపులూ, పచ్చలూ, వజ్రాలూ, వైడూర్యాలూ, నీలాలూ, గోమేధికాలూ వగైరా--సైజులని బట్టి--మూడణాల ముక్కానీ నించి, మూడురూపాయల ముప్పావలా అర్థణా వరకూ లెఖ్ఖ వేసి, రూ. 28 సరిపెట్టారన్నమాట.  


ఇక రాలిపోయిన పెద్ద కెంపు విలువ--మూడురూపాయల ముప్పావలా అర్థణాయే కదా?  


ఈ లెఖ్ఖన మొత్తం ఆభరణాలు యెంత యెక్కువగా లెఖ్ఖగట్టినా, రూ. 52 కోట్లంటే--అన్నన్నా! యేమి తి తి దే వారి దాతృత్వము!  


పోనీ ఆ లెఖ్ఖలే చూసుకున్నా, గత 50 యేళ్ళుగా, మొన్నటి ఆర్థిక సంవత్సర ముగింపువరకూ వచ్చిన కానుకల్ని లెఖ్ఖవేసుకున్నా, అప్పటప్పటి ధరల ప్రకారమైనా, ఓ వందకోట్లన్నా వుండవా?  


నేను 'డైరీ' లో ప్రచురించిన వాటి విలువని కూడినా చాలానే వుంటుందే?  


మరి యెవరి చెవుల్లో పువ్వులు పెడతున్నారు?  


కోర్టే తేలుస్తుంది!


2 comments:

సుజాత వేల్పూరి said...

శ్రీవారు వీళ్ళకి హెచ్చవేతలు నేర్పు గాక!

A K Sastry said...

డియర్ సుజాత!

చాలా సంతోషం!

'..............గాక అనే కోరుకుందాం!

ధన్యవాదాలు!