Monday, May 25, 2009

‘ఆదికేశవుడి.....

…………నెత్తిన సొడ్డు!'
అయిపోయింది! అక్రమంగా ఆర్జించిన పదవి వూడి పోయింది! కేంద్ర ప్రభుత్వం రద్దవగానే, ఆయన (అవిశ్వాసానికి వ్యతిరేకంగా) ఇచ్చిన ఓటు విలువ సున్నా అయిపోయింది—ఆయన ఇక ‘తసమదీయుడు’ అయిపోయాడు! అందుకే ‘అసమదీయుడు’ భూమా కరుణాకర రెడ్డి మళ్ళీ పీఠం యెక్కుతున్నాడు! తను చెయ్యలేకపోయిన, మధ్యలో ఆగిపోయిన పనులన్నీ పూర్తి చెయ్యద్దూ? (వీడు నాస్తికుడట—కానీ, పెద్దసారువాడి మత ప్రచారానికి దోహదం చేశాడు శ్రీ గిరి మీద! ఇంకా యూత్ కాంగ్రెస్ నాయకులు కొండపైకి నిషేధిత ‘అన్నీ’ తీసుకెళుతుంటే అడ్డుకున్నవాళ్ళ మీద తన ప్రతాపం చూపించాడు!) పనిలో పనిగా ఈవో రమణాచారి ని కూడా వేటు వేశాడు—వాళ్ళ వుద్యోగులచేతా, ప్రజలతోటీ కాంగ్రెస్ కి వోట్లు వేయించలేదట! (ప్రజారాజ్యానికి వేయించారని అనుమానమేమో—లేకపోతే చిరంజీవి నెగ్గడుగా!) ఇక ఆది కేశవుడి గతి? యేమో—మరో అవకాశం తలుపు తట్టక పోతుందా! చూద్దాం! బై ది బై ‘బంగారు ముష్ఠి’ లో యెంత గిట్టుబాటై వుంటుంది? దాని లెఖ్ఖలు సరిగ్గా అప్పచెపుతున్నాడా?—ఆ శ్రీనివాసునికే యెరుక!

No comments: