Sunday, October 10, 2010

శ్రీగిరి శ్రీపతి

డాలర్ల కొరత

తి తి దే వద్ద నిల్వలు లేకపోవడం తో రెండు నెలలుగా ఐదు గ్రాముల డాలర్లు విక్రయించడంలేదట.

గతం లో శ్రీవారి హుండీ ద్వారా వచ్చిన చిన్నా చితకా ఆభరణాలని, రాళ్ళు అవీ తొలగించి, బంగారాన్ని కరిగించి మింట్ లో డాలర్ల ముద్రణా, సరఫరా జరిగేవి.

ఇప్పుడు బంగారం కరిగింపులో అక్రమాలు జరుగుతున్నాయని, ఈ వో కృష్ణారావుగారు బంగారాన్ని బ్యాంకుల్లో వడ్డీకి డిపాజిట్ చెయ్యడానికే మొగ్గు చూపారట. అందుకే కొరత అంటున్నారు.

మరి అన్ని వేలో, లక్షలో చిన్నా చితకా ఆభరణాలని యే యే బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారో, వాటి వివరాలు యెక్కడ యెలా నమోదు అవుతున్నాయో--పత్రికలు వ్రాయలేదు.

బంగారం ఇవ్వఖ్ఖర్లేకుండా, మింట్ వారే వారి బంగారం తో డాలర్లు తయారు చేసి సరఫరా చేసేలా వొప్పందాలకి ప్రయత్నాలు జరుగుతున్నాయట.

ఈ ప్రయత్నాలు ఫలించకపోతే, డాలర్ల విక్రయం పూర్తిగా నిలిచిపోయే అవకాశం వుందట!

అసలు ఈ డాలర్ల పథకం యెవరిని వుధ్ధరించడానికి?

యేమో! స్వామికే తెలియాలి!

2 comments:

jaggampeta said...

dabbugalavarni uddarinchadankikandi

A K Sastry said...

డియర్ jaggampeta!

సంతోషం.

ధన్యవాదాలు.