Saturday, January 2, 2010

దర్శనాలు

సదుపాయాలు  


మొన్న వైకుంఠ యేకాదశి సందర్భం గా, మన ఈ వో, ఐ వై ఆర్ కృష్ణారావు ఓ గేటు దగ్గరున్న వుద్యోగిని 'కొట్టేశారని' ఆరోపణలు వస్తే, 'అతని దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే నేను అతని భుజం మీద రెండుసార్లు తట్టి, గేటెందుకు తెరిచావు అని అడిగానంతే!' అని వివరణ ఇచ్చుకోవలసివచ్చింది!  


జనవరి ఒకటిన కేవలం 1500 మాత్రమే వీ ఐ పీ పాసులు జారీ చేశారట! మరో పదిహేనువేలమందికి 'శీఘ్ర దర్శనం' టిక్కెట్లు అమ్మారట!  


వీ ఐ పీ లకి తప్ప, ధర్మ దర్శనం వాళ్ళతో సహా అందరికీ దక్కినది 'లఘు', 'మహా లఘు' 'మహావీర లఘు' దర్శనం మాత్రమే!  


శ్రీవారి దర్శనం ఒక సెకనుకి యెంత 'విలువ' చేస్తుందో ఇదివరకే లెఖ్ఖ కట్టాం!  


మరి ఈ వీ ఐ పీ దర్శనాలూ, సేవలూ యెందుకు రద్దు చెయ్యరు?  


(శ్రీ వారి హుండీ అదాయమే, సో కాల్డ్ పర్వదినాల్లో రెండుకోట్లు దాటుతుంటే, ఈ సేవల రద్దువల్ల పోయే అదాయం యేమూలకి? ఇంకా కావాలంటే--మఠాలకీ, ఇతర రాష్ట్రాల్లోని గుళ్ళకీ మన 'దాతృత్వాన్ని' నివారిస్తే సరి--కొన్ని కోట్లు మిగులుతాయి!)  


యెట్టకేలకు, మన ఈ వో గారు, 'తోపులాట నివారించడానికి మహర్ద్వారం నించి వెండివాకిలి వరకూ' బారికేడ్లు నిర్మిస్తామని మాట ఇచ్చారు! ధన్యులం!  


మరి వెండివాకిలి నుంచి బంగారువాకిలివరకూ--వికలాంగులకీ, చంటి బిడ్డ (మూడేళ్ళలోపు) తల్లిదండ్రులకీ మాత్రమే--బంగారు వాకిలి ప్రవేశాన్ని కల్పిస్తూ, మిగిలినవాళ్ళెవరైనాసరే--ఒకే క్యూ లైనులో వెళ్ళే సదుపాయం చేస్తే యెంత బాగుంటుంది!  


ప్రతీ భక్తుడూ--ఓ 15 సెకన్ల పాటు తనివితీరా స్వామిని చూడడానికీ, మరో 15 సెకన్లు కళ్ళుమూసుకొని, తన కోర్కెలు నివేదించుకోడానికీ కేటాయిస్తే, యెన్నివేలమందైనా దర్శనం చేసుకోవచ్చు కదా?  


నే చెప్పొచ్చేదేమిటంటే, కొంతమంది తెలివైనవాళ్ళు డబ్బుకోసమో, పరపతి కోసమో--శ్రీవారి అలయం లోని పరిస్థితుల్ని (కనీసం దర్శనాల వరకూ) నియంత్రించడం--అనే ఘోర అవలక్షణాన్ని నివారించడం మనచేతుల్లోనే వుంది అని!  


అధికారులు గమనింతురుగాక!



No comments: