Monday, March 1, 2010

ఆరంభశూరత్వం

సంస్కరణలు

భక్తుల సౌకర్యార్థం యేవో సంస్కరణలు తెస్తామనడం ఆరంభ శూరత్వమేనని తేలిపోయింది!

వీళ్ళు ప్రవేశపెట్టిన సంస్కరణల్లా 600 రూపాయల శీఘ్రదర్శనం ఒకటే!

మిగిలినవన్నీ దొడ్డిదారినో, ప్రత్యామ్నాయం గానో కొనసాగిస్తున్నారు.

ఈ శీఘ్ర దర్శనం కూడా, 8 నించి 10 గంటల తరవాత, మహా వీర లఘు గానే కొనసాగుతోందట.

పైగా టిక్కెట్లు 'బ్లాక్' లో అమ్ముతున్నారట. ఈ భక్తుల్ని కూడా శ్రీపతే రక్షించుగాక.

రెండో వైకుంఠం లో అనుకుంటా, తలుపులు తెరిచి బయటికి వెళ్ళి, మళ్ళీ చెప్పిన టైముకి తిరిగి కాంప్లెక్స్ లోకి వచ్చే సౌకర్యం కల్పించారట--మరి సుదర్శనం టోకెన్ల వుద్దేశ్యం అదే కదా? వాళ్ళు కూడా మళ్ళీ కాంప్లెక్స్ లోంచి బయటికి వచ్చి, చెప్పిన టైముకి తిరిగి రావాలో యేమిటో!

చంటిపిల్లల తల్లులకి కూడా మహర్ద్వారం నించి జనరల్ క్యూలో కలిపేస్తారట!

మొన్నటి బోర్డు సమావేశం తరవాత, విలేఖర్లు అడిగిన ప్రశ్నకి ఆదికేశవుడు 'యెస్కలేటర్ ప్రవేశపెట్టే ప్రతిపాదనేమీ లేదు--యెవరైనా ప్రతిపాదన బోర్డుకి పంపితే, చూస్తాం!' అన్నాడు.

మరి ప్రతిపాదన పెట్టవలసినవాళ్ళకి యేమైనా సూచన ఇచ్చారా? ఇవ్వరు! ప్రతిపాదన యెవరు పెట్టాలి? బ్లాగరులా? భక్తులా? వుద్యోగులా? వీ ఐ పీ లా? ప్రజా ప్రతినిధులా?

వీళ్ళెవరైనా ప్రతిపాదన చేస్తే దాన్ని బోర్డు స్వీకరిస్తుందా?

మరెందుకీ శషభిషలు!

పైగా 'బడ్జెట్' ప్రకారం దేవస్థానం ఆదాయం తగ్గిపోతోందట! శని ఆది వారాల్లోనే, హుండీ ద్వారానే కొన్ని కోట్ల ఆదాయం వస్తూంటే--తగ్గడం యెలానో?

అప్పలకీ, దొప్పలకీ అనవసర కేటాయింపులు మానుకుంటే, బడ్జెట్ బ్యాలన్స్ అవుతుంది కదా?

పైగా, రథాలో, బళ్ళో ద్వారా 'మొబైల్ ' దర్శనాలట--ప్రతీ వూళ్ళోనూ! ఇంకేం? కాసుల పంట, నిర్వాహకులకి!

కృష్ణారావుగారూ--ఈ స్కీం మీదేనా?

బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు అన్నట్టు ఆ స్వామికి యేమైనా పుడితే, అప్పుడు చూడాలి వీళ్ళ తైతక్కలు!

శుభం భూయాత్!

No comments: