Wednesday, June 23, 2010

అక్రమార్కులు

'......సేవలు'

కొంతమంది ఆర్జన కి మాత్రమే వుపయోగపడుతున్న ఆర్జిత సేవల టిక్కెట్ల కుంభకోణం లో, సుబ్బిరామిరెడ్డి హస్తం కూడా వుందట.

'ఓ ఇరవై లక్షలు పంపించాం! ఉదయాస్తమాన సేవ టిక్కెట్ కోసం--అవి లేవన్నారు, సరేపోనీ మిగిలిన సేవలకి ఓ 168 టిక్కెట్లో, 186 టిక్కెట్లో పంపించండి అన్నాం! వాళ్ళు వెంటనే పంపించారు' అని ఆయన భార్య వివరణ.

'ఇందులో యేమీ అక్రమాలు లేవు' అని ఆదికేశవుడి సమర్థన!

వీ ఐ పీ ల కోసం, గంటలతరబడి క్యూ లైన్లు ఆపెయ్యడం--'ఒక్క క్షణం కూడా ఆపలేదు' అని ఆదికేశవుడి బుకాయింపు!

లఘు, మహా లఘు, మహావీర లఘు దర్శనాలకి సామాన్యులకి అనుమతిస్తున్న ఓ సెకనో, రెండు సెకన్లో సమయం ప్రకారం రేటు కట్టి, వీ ఐ పీల దగ్గర అంత డబ్బూ యెందుకు వసూలు చెయ్యరు?

వాళ్ళు సేవలు చేస్తేనే స్వామి తరిస్తున్నాడా?

అసలు ఈ సేవల్ని యెందుకు రద్దు చెయ్యరు?

2 comments:

Sujata M said...

'ఓ ఇరవై లక్షలు పంపించాం! ఉదయాస్తమాన సేవ టిక్కెట్ కోసం--అవి లేవన్నారు, సరేపోనీ మిగిలిన సేవలకి ఓ 168 టిక్కెట్లో, 186 టిక్కెట్లో పంపించండి అన్నాం! వాళ్ళు వెంటనే పంపించారు' WHahat ? nijama ?

A K Sastry said...

ఆహా! స్వయం గా సుబ్బిరామిరెడ్డి భార్య పత్రికలవాళ్ళకి ఇచ్చిన వివరాలే ఇవి!

నిజం గా నిజాలే అనుకోవాలి మరి!