Monday, July 19, 2010

శ్రీగిరి శ్రీపతి

దర్శనాలు

ఆది కేశవుడు మళ్ళీ ఇంకో కాంగీరేసు నాయకుణ్ణి 'మహావీర స్పెషల్' దర్శనానికి తీసుకెళ్ళాడట. క్యూలైన్లు ఆపలేదుట లెండి.

ఆ నాయకుడికీ, వెనకాలో పదిహేను మందికీ మాత్రమే, అందరికీ శీఘ్ర దర్శనం టిక్కెట్లు తెప్పించి, (అక్షరాలా తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు--యెవరిచ్చారో!) వాళ్ళని ఆ లైన్లో రమ్మని, ఈయన మహర్ ద్వారం దగ్గర నించొని, వాళ్ళందరినీ తీసుకెళ్ళి, లఘు దర్శనం స్థానం లో వున్న తండులను తొలగించి, సన్నిధికి తీసుకెళ్ళి, నైవేద్యం గంట సమయం లో, ప్రత్యేక దర్శనం చేయించాడుట.

(మరి ఆ స్వామికి ఆ సమయం లో ఆ ప్రసాదం సహించిందో లేదో!)

ఈ దేవస్థానం పాలిటికి మోహన్ బాబొకడు. 

వేదపాఠశాలకెళ్ళి, 700 మంది విద్యార్థులు దారుణమైన మౌలిక వసతుల మధ్య వున్నారనీ, వాళ్ళ భోజన శాల పందులు తిరిగే ప్రదేశం లా వుంది అనీ, విలేకర్ల సమావేశం పెట్టి మరీ తగులుకున్నాడు.

ఈ వో గారు, "ఓ నెల లోపు" చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారట.

పాపం ఆ విద్యార్థుల గతేమౌతుందో!

మరి భక్తి చానెల్ వాళ్ళు, గంటకొట్టినంతసేపూ ఆడియో వినిపిస్తూ, గోపురం వీడియో చూపించేకంటే, ఇలాంటి పాఠశాలల్నీ వగైరాలని చూపిస్తే యెలా వుంటుందో.

 

No comments: