Friday, August 20, 2010

తితిదే పాలక మండలి

శుభవార్త

ఇప్పటికి రాష్ట్ర మంత్రి మండలి, ప్రస్తుత తితిదే పాలక మండలి గడువు ముగిశాక, కొత్తగా యెవరినీ నియమించకుండా, ఓ ప్రత్యేక అధికార సంస్థ (అథారిటీ) యేర్పాటు చెయ్యాలని  నిర్ణయించిందట.

ఇప్పటికిది శుభవార్తే మరి. ఆ సంస్థ యెలా వుంటుందన్నది తరవాత సంగతి.

ఈ లోగా ఆదికేశవుడు మొయిలీ దగ్గరనించి ప్రణబ్ వరకూ; అహ్మద్ పటేల్ నించి సోనియా వరకూ వినతిపత్రాలు ఇచ్చుకుంటూ వస్తున్నాడట--తనకి ఇంకో అవకాశం ఇవ్వాలని! (ఆయనకి పగ్గాలు అప్పగించిన ఆసలు ఒప్పందం లో ఒకసారి అని వుందో, రెండుసార్లు, లేదా ఆయన జీవితకాలం అని వుందో తెలియదు మరి)

ఇక, ఆర్జితసేవా టిక్కెట్ల కుంభకోణం లో--ఇది గత నాలుగేళ్లుగా సాగుతోందనీ, పాలక మండలి సభ్యులు యాదయ్య, అంజయ్య, సుబ్రహ్మణ్యం అనేవాళ్లతో సహా మొత్తం 54 మంది  దీనికి బాధ్యులు అని వారి విజిలెన్స్ శాఖ నిర్ధారించి, వారిమీద చర్యలు తీసుకోమని నివేదిక ఇచ్చిందట.

ఇందులో, యాదయ్య, అంజయ్య--బలహీన వర్గాలకి చెందినందువల్లే తమని ఇరికించారని ఆరోపించారట! మరి నివేదికలోని మిగిలిన పాలకవర్గ సభ్యుల కులాలేమిటో మనకు తెలియదు.

(ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థలేకాదు--మిగిలిన సంస్థల్లోకూడా, సహజం గా వాళ్ల విజిలెన్స్ శాఖలో, మేనేజిమెంటు యెవరిని నొక్కెయ్యమంటే వాళ్లని నొక్కేసే తొత్తులు వుంటారనుకోండి.)

నిజానిజాలు శ్రీవారికే తెలియాలి.

కొసమెరుపేమిటంటే, సూర్యనారాయణ రెడ్డి, కస్తూరి రంగన్ అనే తితిదే వుద్యోగులు ఈ తరహా కుంభకోణానికి పాల్పడుతున్నారని విజిలెన్స్ సంస్థ 2008 లోనే నివేదిక ఇచ్చినా, అప్పటి ఈవో అది బుట్టదాఖలు చెయ్యడమే కాకుండా, వాళ్లకి పదోన్నతులు ఇచ్చారని ఈ నివేదికలో పేర్కొన్నారట!

అదండీ సంగతి!

No comments: