Wednesday, November 5, 2008

'దేవతా వస్త్రమా?'

శ్రీవారి గర్భగుడి విమానం ‘ఆనంద నిలయం’ పూర్తిగా ఇదివరకే బంగారు తాపడం చెయ్యబడింది. ఇప్పుడు ఆలయం లోపల మంటపాల్నీ, బంగారు వాకిలి ప్రాంతాన్నీ పూర్తిగా బంగారు తాపడం చెయ్యడానికి—35 కేజీల బంగారం అవసరమౌతుందని మొదట్లో అంచనా వేసి, ‘ఆదికేశవుడు’ శ్రీవారి బంగారు ముష్టి స్కీం ప్రవేశపెట్టాడు.

అంతలోకే, అంచనా (జలయజ్ఞం లో లాగ) 43 కేజీలకి పెరిగిపోయింది! స్పందన బాగానే వుందట!

సందట్లో సడేమియాగా, అనేకమంది ఈ బంగారు ముష్టి ప్రారంభించేసారట. అందులో శ్రీ వారికి చేరెదెంతో, ముష్టివాళ్ళ శ్రీమతులకి చేరెదెంతో!

ఇంకా అదేదో ‘చెన్నై సలహా మండలి’ట. అదేదో యెప్పుడో యేర్పడిందట! దాని మీద ఆగ్రహం వ్యక్తం చేసిన ‘ఆది కేశవుడు’ దాన్ని రద్దుచేసాడో—ఎంక్వైరీ కమిటీ వేశాడో—ఏదోనట! అసలు శ్రీ వారి దగ్గర ఎంత బంగారం వుంది?

‘హాథీరాంజీ మఠం’ నించి తి.తి.దే కంట్రోలు లోకి శ్రీ వారి ఆలయం వచ్చినప్పటినించి, శ్రీ వారికి వచ్చిన కానుకలకేమైనా లెఖ్ఖా పత్రం వున్నాయా?

వాటి భద్రత మాటేమిటి?

అందరూ చూస్తూ వుండగానే, పరకామణిలో డబ్బూ, బంగారు వస్తువులూ, బంగారు డాలర్లూ, అమెరికా డాలర్లూ, మాయమౌతున్నట్లు అప్పుడప్పుడు వస్తున్న వార్తల్లోనే, వాటి విలువ కొన్ని లక్షలల్లో వుంటోందే?

మరి ‘లోపలి’ వాటి మాటేమిటి?

No comments: