Wednesday, November 26, 2008

కాల ఙ్ఞానం!

బాబా కాల ఙ్ఞానం!
దశాబ్దాల క్రితమే హైదరాబాద్ దూర దర్శన్ వారి చాయాగ్రహణ యంత్రాల్లో ‘రెడ్ హాండెడ్’ గా దొరికి పోయి, పబ్లిక్ లో మేజిక్కులు చెయ్యడం మానేసిన సాయి బాబా, మొన్న కాల ఙ్ఞానం చెప్పారు! ‘వచ్చే 28 యేళ్ళలొ భారతదేశం అగ్రరాజ్యంగా అవతరిస్తుంది. కొద్ది రోజుల్లో ప్రపంచమంతా ఒకటై పోతుంది! 28 యేళ్ళ తరవాత ప్రపంచమంతా మన దేశం లో కలిసి పోతుంది! ఒకే గొడుగు కిందకు చేరి భారత దేశం అగ్ర రాజ్యం అవుతుంది! అందరూ భారతీయులు అయి పోతారు! మన ఆధిపత్యమే సాగుతుంది!’ అంటూ సెలవిచ్చారు. కొత్త బంగారులోకం కోసం యెంత అందమైన బంగారు కల! అంతేకాదు—‘సచ్చీలురుగా విదేశాలకు వెళ్ళి……..దుర్గుణాలతో తిరిగి వస్తున్నారు’ అని కూడా వాపొయారు(ట)! దీని భావమేమి శ్రీగిరీశా?—సారీ పుట్టపర్తి నివాసా? (బై ది బై, ‘కుల్వంత్’ యెవరో మీకు తెలిస్తే కాస్త చెప్పరూ?)

No comments: