Monday, April 12, 2010

శ్రీగిరి శ్రీపతి

ప్రసాదాలూ, సేవలూ

మొన్న ఓ పేపర్లో, 'శ్రీవారి అన్నదానం కోసం లడ్డూలు చుడుతున్న కార్మికులు ' అంటూ కొందరు స్త్రీల ఫోటో ని ప్రచురించారు. 

వాళ్ళు శ్రీవైష్ణవులేనా? వాళ్ళని ఆగమ శాస్త్రం ప్రకారం నియమించారా? మొదలైన విషయాలు ఆ పత్రిక వ్రాయలేదు. 

అన్నదానం కోసం వేరే, ప్రసాదం కోసం వేరే లడ్డూలు తయారు చేస్తారా? అన్న విషయం కూడా ఆ పత్రిక వ్రాయలేదు.

ఇక శ్రీవారి సేవలకి ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది కదా దేవస్థానం! 

మనం ఇదివరకే లెఖ్ఖలు వేశాం--ఈ సేవల్లో పాల్గొనేవాళ్ళు యెంతెంత చెల్లించాలో! కానీ, సేవల టిక్కెట్టు ధర కేవలం 120 రూపాయలు మాత్రమేనట!

వుదాహరణకి, శ్రీవారి సుప్రభాత సేవకి, 200 మంది భక్తుల్ని మాత్రమే అనుమతిస్తారట. 24000/- మాత్రమే ఆదాయం వస్తుంది ఒక రోజుకి. కానీ, ఆన్ లైన్ లో ఒకే పేరుతో, ఒకే నెలలో, 16 టిక్కెట్లు బుక్ అయ్యాయట! మళ్ళీ ఒక్కొక్క టిక్కెట్ నీ 2000/- కు పైగా దళారులు విక్రయిస్తున్నారట!

యే పథకాన్నైనా ప్రవేశపెట్టే ముందు, దానికి సంబంధించిన సాఫ్ట్ వేర్ ని అనేక విధాల పరీక్షించి మరీ ప్రవేశ పెడతారు. కానీ మన దేవస్థానం వారు మాత్రం, డబ్బులు చెల్లించేసి, సప్లయర్స్ "ఇంక మీ ఇష్టం--తన్నుకు చావండి" అన్నా, చక్కగా వొప్పుకుంటారట.

ఇప్పుడు, కొత్త ప్రోగ్రాం రూపొందించారట!

అసలు, ఈ సేవల టిక్కెట్ల రేటునే 2000/- నిర్ణయించవచ్చుకదా? 4,00,000/- వస్తాయిగా? మన లెఖ్ఖకూడా దాదాపు సరిపోతుంది కదా? ఆ పని యెందుకు చెయ్యరు?

(ఈ సేవల్ని ఆసాంతం రద్దు చేస్తే మహా బాగుంటుంది--కానీ.......జరగడం లేదు!)

ఇక లడ్డూ కాకుండా, ఆపం, వడ, పొంగలి మొదలైన పదహారో యెన్నో రకాల ప్రసాదాలని నైవేద్యం పెడతారు ప్రతీరోజూ శ్రీవారికి! ఇవేవీ భక్తులకి దక్కవు.

ఓ హోటల్లో ఓ పెద్దమనిషికి 3000/- రూపాయలు ఇస్తే, ఒక్కొక్క ప్రసాదం నామకహా జాగ్రత్తెపెట్టి, మనకి ఇస్తారట!

అదే 8000/- ఇస్తే, కావలసినంత క్వాంటిటీలో అన్ని ప్రసాదాలూ మనకి ఇస్తారట!

మరి ఈ ప్రసాదాల రేటు కూడా అంతకి పెంచితే, అక్రమాలు జరగకుండా, కొనుక్కోగలిగినవాళ్ళకే అందుతాయి కదా? ఆ హోటలు వాళ్ళెందుకు బాగుపడాలి?

ఈ వో గారూ! కొంచెం చూస్తారా?

No comments: