Saturday, April 3, 2010

శ్రీగిరి శ్రీపతి

దర్శనాలు, ప్రసాదాలు


శ్రీవారి నిత్యాన్నదానం ట్రస్ట్ కి 25 యేళ్ళు నిండుతున్నాయి. 60 లక్షల తో ప్రారంభమైన ట్రస్ట్, 220 కోట్లకి పెరిగిందట. శుభం!

అన్నిదానాలలోకీ అన్నదానం గొప్పది అంటారు. అలాంటి దానానికి డిపాజిట్లు ఇచ్చిన దాతలు ధన్యులు.

నిజం గా ఆకలిగొన్నవాళ్ళతోపాటు, శ్రీవారి ప్రసాదం గా భావించి స్వీకరించేవాళ్ళు, ఓ పనైపోతుంది అని యెంగిలి పడి లేచేవాళ్ళు--యెవరైనా, రోజుకి ఓ 80 వేలమంది భోజనాలు చేస్తున్నారు.

ఆ మధ్య ఈ డిపాజిట్లని బ్యాంకులకి తనఖా పెట్టి అప్పుచేసి, ఆ అప్పుని మళ్ళీ ఇంకో రకం గా వుపయోగిస్తున్నారు అని వార్తలు వచ్చాయి. మరి దీని సంగతి యేమయ్యిందో!

రోజుకు 3 లక్షల లడ్డూల తయారీ కోసం యేర్పాట్లు చేశారట. ఇందుకు "సనాతన సంప్రదాయం మేరకు" "ఆగమ శస్త్రోక్తం గా" 250 మంది "శ్రీవైష్ణవ బ్రాహ్మణులను" పోటు కార్మికులుగా నియమించారట. (అసలు ఆగమ శాస్త్రానికీ, బూందీ తయారీకీ, లడ్డూలు చుట్టడానికీ సంబంధం యేమిటో! వాళ్ళెవరికైనా ఈ విద్యల్లో ప్రావీణ్యం వుందో లేదో పరీక్షించారా? లేక శ్రీవైష్ణవులు అవడమే క్వాలిఫికేషనా? యేమో!)

ఈ మధ్య ద్వారకా తిరుమలలో లడ్డూ ప్రసాదం లో పటికబెల్లం బిళ్ళల సంఖ్యని కొంచెం తగ్గించారు. ఈలాంటి అలోచనేమైనా వీరికి వుందా?

ఇంకా, రోజుకు 8 టన్నుల ఆవునెయ్యి సరఫరాకి--గాలి సోమశేఖర రెడ్డి తో వొప్పందం చేసుకుంటారట! (ఈయన మన గాలి ధనార్జన రెడ్డి సోదరులకి యేమౌతారో తెలియదు.)

ఇక మనం ఓ ట్రెడ్ మిల్ లాంటిది యేర్పాటు చేస్తే బాగుంటుంది అనుకున్నట్టు, శ్రీవారి దర్శనానికి మహర్ద్వారం నించి శ్రీవారి సన్నిధి, విమాన ప్రాకారం కింది భాగం  మార్గం ద్వారా తిరిగి మందిరం వెలుపలివరకు 'చేరవేత పట్టా' (కన్వేయర్ బెల్ట్) యేర్పాటు పై బెంగుళూరుకు చెందిన బి ఎన్ ఎ టెక్నాలజీ కన్సల్టింగ్ లిమిటెడ్ కంపెనీ నిపుణులు ఆలయాన్ని సందర్శించారట.

యెంత శుభవార్త! 

కాని, ఇక లఘు, మహాలఘు, మహావీరలఘు దర్శనాల స్థానం లో, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ డీలక్స్ దర్శనాలు ప్రవేశపెడతారేమో--సామాన్యులకి, వీ ఐ పీ లకి, వీ వీ ఐ పీ లకి--అదే క్రమం లో! (అంటే, సామాన్యులు పట్టా యెక్కినప్పుడు వీర స్పీడులో పరిగెట్టేలా, మిగిలినవాళ్ళకి కొంచెం నెమ్మదిగా, తరవాతవాళ్ళకి ఇంకొంచెం నెమ్మదిగా నడుపుతారేమో ఆ పట్టాని!)

చూద్దాం!

No comments: