Thursday, April 22, 2010

శ్రీగిరి శ్రీపతి

తాజా వార్త

ఆయనెవరో వేసిన మాత్ర (పిల్) లో ఉన్నత న్యాయస్థానం 'ఆనంద.........మయం' కార్యక్రమం పై 'స్టే' ఇచ్చిందట.

(ఆనంద మయం కావలసిన నిలయాన్ని, స్వర్ణ మయం చెయ్యదలుచుకోడమే క్షమించరాని నేరం)

అయినా ఆదికేశవుడు వూరుకుంటాడా అని నా సందేహం. 

(ఓ పక్కన తెలంగాణా రాజుకుంటే, గాలి తన 'స్టేలు' వెకేట్ చేయించుకుని కొన్ని వేల కోట్ల ఇనప ఖనిజాన్ని యెగుమతి చేసేశాడు--సందట్లో సడేమియాగా! అలాంటివి మన న్యాయస్థానాలు!)

అన్నట్టు గాలి గారిచ్చిన వజ్రకిరీటం విలువ 23 కోట్లో యెంతో తేల్చారట కమిటీ వారు--అదేదో స్కోప్ తో పరీక్షించి! (మీడియా చెప్పిన, బహుశా ఆయన ఇన్ కమ్ టేక్స్ రిటర్న్ లలో చూపించిన--59 కోట్లో యెంతో కాదన్నమాట!)

పైగా అంబానీ లాంటివాళ్ళు తమ 'ఇస్తికఫాల్ ', 'తీసుకుంటి కపాల్ ' లాంటి స్వాగతాలకి సంబరపడిపోయి, మళ్ళీ ఈ 'మయం' కి 1.11 కోట్లు ఇచ్చారట. (ఇంతకు ముందు 5.5 కోట్లో యెంతో ఇచ్చారట.)

ఈ మధ్య ఇంకాచాలా మంది కొన్ని కేజీల బంగారాన్నీ, కోట్ల రూపాయల్నీ ఇచ్చారు. 

(రేపు మన కేశవుడు 'యేడుకొండలూ స్వర్ణమయం' కార్యక్రమాన్ని ప్రకటించినా ఆశ్చర్యం లేదు!)

దేవుడా! అందరికీ మంచి బుధ్ధిని ప్రసాదించు!

అని తప్ప ఆ స్వామిని యేం వేడుకోగలం?

No comments: