Tuesday, April 13, 2010

శ్రీగిరి శ్రీపతి

దర్శనాలు......

గిరిజన గోవిందానికి హాజరయ్యే భక్తులకి, శ్రీవారి రాగి డాలర్లు పంచిపెడతారట.

ఆర్జితసేవా టిక్కెట్ల ధరల పెంపు విషయం లో ఇంకా యెలాంటి నిర్ణయం తీసుకోలేదట.

శీఘ్రదర్శనం ద్వారా నాలుగు గంటల్లో భక్తులకి దర్శనమయ్యేలా కృషి చేస్తారట.

ఏ వీ ఎస్ వో వెంకట శివుడు పై వేటు వేయాలని నిర్ణయించారట.  డిప్యూటీ ఈ వో భాస్కర రెడ్డి పై కఠిన చర్యలు తీసుకుంటారట.

వైకుంఠం 2 లో కాయిన్ బాక్స్ ఫోన్లు యేర్పాటు చేస్తారట.

కేటాయించినవారు కాకుండా ఇతరులు 'వినియోగిస్తున్న' 400 కాటేజీలని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారట.

ఈ వో--ఐ వై ఆర్ కే రావు గారి ప్రకటనలివి.

శుభం!

వీ ఐ పీ లకి మాత్రం వారి అనుచరుల్తో సహా అందరికీ 'పెద్ద పీటలు' పట్టుకొని రెడీ గా వుంటున్నారట--దేవస్థానం వారు.

నిన్న (13-04-2010) న ప్రముఖుల పేరిట 700 వీ ఐ పీ దర్శన టిక్కెట్లు విక్రయించారట. వీరందరికీ దర్శనం పూర్తి అయినా, 7-45 లోపే ధర్మ దర్శనం ప్రారంభించాల్సింది, 9-00 దాటినా మొదలవలేదట.

కారణం--ముఖ్యమంత్రి అల్లుడు తో పాటు ఓ 50 మందికి పైగా, వారి దర్శనం పూర్తయ్యాక, చిరంజీవి, అయన పార్టీ నేతలూ చాలాసమయం శ్రీవారి సన్నిధి లో గడిపారట!

వాళ్ళు శ్రీవారి సన్నిధిలో వున్నా, ధర్మ దర్శనం కొనసాగించవచ్చుకదా? వాళ్ళు యెలా మొక్కుతున్నారో సామాన్యులు చూస్తే వీ ఐ పీ లకీ, వాళ్ళ అనుచరులకీ నమోషీ యేమో!

ఇన్ని వందల మందికి 'పెద్ద పీటలు' యెప్పుడు మానేస్తారో!

తిరుమలేశా! నీదే భారం!

No comments: