Thursday, June 18, 2009

'ఓం సాయి, శ్రీ సాయి.....

(నా టపా మీద శ్రీ vibey చేసిన కామెంట్ కి నా జవాబు ఇంకో టపా రూపం లో!)
డియర్ vibey! 'వాడుకూడా..........సంపాదనలో పడ్డాడా' అని అడిగారంటే, నాగోల సమూలం గా మీకు అర్థం అయినట్టే!
ఒక్క ముక్క అర్థం కాలేదంటే, అంగీకరించడానికి మొహమాట పడుతున్నారన్నమాట!
నా టపాలు అన్నీ ఓపికగా చదివితే, నా ముఖ్యోద్దేశ్యం ప్రజల, సోకాల్డ్ భక్తుల 'మూర్ఖత్వం' 'అట్టర్ ఫూలిష్ నెస్ ' ని బయటపెట్టి, కొంచెమైనా 'వారికి ' ఉపశమనం, సౌకర్యం కలిగించడానికే అని మీరే అంగీకరిస్తారు!
మరి ఆయనైతే, కలియుగాంతం వరకూ కుబేరుడికి వడ్డీ కట్టడానికి, నిలువుదోపిడీలు చేసేవాడు--ఇప్పుడెవరిస్తున్నార్లెండి నిలువుదోపిడిలు! ఈయనకేం పని? మరి చక్కగా అవుతున్న దర్శనాలని చెడగొట్టి, తోపులాటలకి యెందుకు అవకాశం కల్పించాలి?
ఆయన 'సజీవం' గా వున్నప్పుడు అని, ఆయనా 'ఒక మనిషే' అన్న నిజాన్ని అంగీకరించినందుకు నా ధన్యవాదాలు!
ఇక, ఆయన 'ఒకరోజులో పేదలకు పంచే డబ్బులు ' గురించి చెప్పాలంటే, అసలు ఆయనకి డబ్బంటే యేమిటో తెలుసా? దాహం గా వుందని చెపితే, మరుగుతున్న బంగారం ఇచ్చిన కంసాలి దగ్గరనించి దాన్ని తీసుకొని, మంచినీళ్ళలా తాగినవాడు (ట) సాయి!
ఓ ముప్ఫై యేళ్ళ క్రితం, ఆంధ్రదేశం ' లో ఓ 'జిల్లేళ్ళమూడి అమ్మ ' వుండేది! (అప్పటికి మీరు పుట్టారో, లేదో) ఆవిడ భక్తులకి నిత్యాన్నదానం జరిపించడానికి వీలుగా, ఉభయ గోదావరి జిల్లాల నించే, ప్రతీ వూరు నించీ, యేకం గా లారీలు లారీలు బియ్యం, కూరగాయలూ, పప్పు దినుసులూ, చింతపండు కరివేపాకు దగ్గరనించీ, ఉప్పు వరకూ (భక్తులు చేసిన వసూళ్ళ రూపం లో) వెళుతూ వుండేవి!
ఆవిడ, భోజనం పళ్ళెం లో అన్నం కలిపి, ఒక్కో భక్తుణ్ణీ దగ్గర కూర్చో పెట్టుకొని, ముద్దలు తినిపిస్తూ, 'తినరా నాన్నా! నువ్వు తింటే నాకు కడుపు నిండి పోతుందిరా!' అంటూ, ఒక్కో ముద్దా పెట్టి, 'బ్రేవ్' మని త్రేన్ చేదట! (చాలా గొప్పగా చెప్పుకొనేవారు!) (తన సొమ్మైతేగదా!)
చివరికి, 'కడుపులో గ్యాస్ ' యెక్కువై, 'ఉదర క్యాన్సర్ ' బారిన పడి మరణించింది! (ఆవిడ భర్తే దీనంతటికీ సూత్రధారుడని లోకం కోడై కూసింది ఆ రోజుల్లో!--ఈ రోజుల్లో కూడా ఆమెకి భక్తులు మిగిలి వున్నా, ఆశ్చర్యంలేదు!)
కాస్త ఆలోచించండి!

No comments: