Sunday, May 22, 2011

వేదపాఠశాల - 5



.....వేధింపులు

సోకాల్డ్ చర్చ గురించి ఇంకా చాలా వున్నా, ఈ మాత్రం చాలనుకుంటా. 

ఇంక చర్చా నిర్వాహకుడూ, చర్చకులూ "కన్వీనియెంట్" గా మరిచిపోయిన విషయాలు :

1. జరిగాయి అని ఆరోపించబడిన సంఘటనల పూర్వాపరాలు. అసలు యేమి జరిగింది అన్నదాని గురించి ఆయన యేమనుకుంటున్నాడో  ఈవోగారిని ప్రశ్నించి, ఆయన సమాధానాన్ని క్లిప్పింగు చూపించకపోవడం.

2. బాధితుడి/అతడి తండ్రి, బయటపెట్టిన మీడియా వాళ్ల--విజువల్స్ చూపించకపోవడం.

3. 150 మందికి మాత్రమే వుద్దేశించిన పాఠశాలలో 845 మందిని యెలా చేర్చుకొన్నారు? ఓ పెద్దగదికి 10 మంది చొప్పున వున్నా, మొత్తం 85 గదులూ, వుపాధ్యాయులకి--వందమంది విద్యార్థులకి ఒక వుపాధ్యాయుడు లెఖ్ఖవేసుకొన్నా, 9 గదులూ, ప్రథానాచార్యుడికో గదీ ఇలా లెఖ్ఖవేసినా, 100 గదులు కనీసం వుండాలి. అన్ని వున్నాయా? పోనీ పెద్ద పెద్ద హాళ్లు వున్నా, కనీసం ఓ యేడంతస్తుల భవనమైనా వుండాలి కదా? మరి వుందా?

4. విద్యార్థులకి నిద్రించడానికి డార్మెటరీల్లాంటి యేర్పాటు యేమైనా వుందా? నేలమీదే నిద్రిస్తున్నారా?

5. విద్యార్థులు యే క్లాసులవాళ్లు యే గదుల్లో/హాళ్లలో నిద్రించాలో యెవరు నిర్దేశించారు? లేక యెవరిష్టం వాళ్లదా?

6. హాస్టళ్లకి వార్డెన్లు యెవరైనా వున్నారా? వంట, భోజన శాలలనీ, క్లాసు రూములనీ, స్టడీ రూములనీ, లైబ్రరీలనీ యెవరు పర్యవేక్షిస్తున్నారు?

7. విద్యార్థుల అటెండెన్సు సంగతేమిటి? వాళ్లు చూపించిన విజువల్స్ ప్రకారం ఓ క్లాసులో గురువుతో వేదం వల్లెవేస్తున్నవాళ్లు 15 నుంచి 20 లోపు మంది మాత్రమే కనిపించారు. ఆ లెఖ్ఖన రోజూ కనీసం 400 కి పైగా క్లాసులు జరుగుతూ వుండాలి. మరి 9 యేళ్లుగా, 10 యేళ్లుగా విద్యార్థులు యెన్నిరోజులపాటు వేదాన్ని పఠించారు?

8. ఇకనుంచీ "ఎడ్మిషన్లు" రద్దుచేస్తున్నాము అని ఈవోగారు స్పష్టంగా ప్రకటించారు. మరి "ఎడ్మిషన్లు కొనసాగుతాయి. యెట్టి పరిస్థితుల్లోనూ ఆగవు" అని చర్చాపకుడు శ్రీనివాస్ కాలర్స్ కి హామీ పదే పదే యెలా ఇచ్చారు? జరుగుతున్నది యేమిటి? జరగబోయేది యేమిటి?

ఇలా వ్రాస్తూపోతే, అనేక ప్రశ్నలు. 

కొన్నిటికైనా సమాధానాలు రాబట్టగలమేమో చూద్దాం!

(యిప్పటికింతే!)


No comments: