Saturday, May 7, 2011

శ్రీగిరి శ్రీపతి



.....దర్శనాలు

మూడేళ్లకి పైగా మనం మొత్తుకుంటూంటే, ఇప్పుడు ఈవోగారు స్వయంగా అదేదో "మూవింగ్ ప్లాట్ ఫామ్" (తెలుగులో కదిలే తివాచీ అంటున్నారు) ని స్వయంగా పరీక్షించారట--శ్రీవారి "నమూనా" దేవాలయంలో! 

ఆ తివాచీ మీద 12 మంది వెళ్లి, (వాళ్లే దాన్ని నడుపుకొంటూనో....డ్రైవరు వుండాలో?) కేవలం 10 నుంచి 20 సెకన్లలో శ్రీవారి దర్శనం చేసుకోవచ్చట. "మహాలఘు" రోజుల్లో దీన్ని ప్రవేశపెట్టచ్చేమో అని వారి ఆలోచనట!

దాని ఖరీదెంతో, ఓ లక్ష మందికి దర్శనం కల్పించడానికి అలాంటివి యెన్ని కావాలో, ఒకటే అనేక "ట్రిప్పులు" వేస్తుంటే, ఓ ఇరవై గంటల్లో (ఓ నాలుగ్గంటలు శ్రీవారిని నిద్రపోనిచ్చినా) యెంతమంది దర్శనం చేసుకోగలరో......వగైరాల లెఖ్ఖలకి మీ క్యాలిక్యులేటర్లు బయటికి తీయండి. (కేవలం 37,200 మంది మాత్రమే అని జవాబు వస్తుంది!)

పైగా, దాన్ని యెక్కడనుంచి యెక్కడవరకూ ప్రవేశపెడతారో తెలీదు. మహర్ద్వారం నుంచా, ధ్వజ స్థంభాలనుంచా, ఆళ్వారులనించా, అదేదో పడి నుంచా, జయవిజయులనుంచా.....యేమో!

మరి దారిలో వుండే యెత్తుపల్లాలమాటేమిటి? మెట్ల మాటేమిటి? ద్వారాల తలుపులు మూయవలసి వస్తే మాటేమిటి? 

ఈవోగారు కాదేమోగానీ, యెవరో యెవరితోనో "కుమ్మక్కయ్యారు" అనిపించడంలేదూ?

అప్పుడే టీవీలవాళ్లు అది "ఆగమ శాస్త్రానికి విరుధ్ధమా?" అని చర్చ. కొంతమంది పండితులు ఖచ్చితంగా విరుధ్ధమే--యెందుకంటే, శ్రీవారి దర్శనం "భూమి మీద నిలబడే" చేసుకోవాలి అంటూ! (అక్కడికి ఆ ప్లాట్ ఫామ్ యెక్కినవారు యేదో అంతరిక్షంలోకి వెళ్లిపోయినట్టు!)

అసలు "ఆగమ శాస్త్రాలకీ", దర్శనం చేసుకొనే భక్తులకీ సంబంధం యేమిటి?

ఈవోగారూ! ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలకి అనుమతించవద్దు. 

మాక్కావలసింది--ఓ "కన్వేయర్ బెల్ట్" లాంటిది--మహర్ ద్వారం గుండా--అవసరమైతే, వెయ్యికాళ్ల మండపం వుండే స్థానంలో బహుళ అంతస్తుల అండర్ గ్రవుండ్ క్యూలైన్లు కట్టి అయినాసరే! (దీంట్లో వున్న సౌలభ్యం ఇంకోటి తెలుసా? భక్తులు తమ "పృష్ట" భాగాన్ని శ్రీవారికి చూపించరు! మహమ్మదీయులు తమ "దర్గా"లలో ఇలా యెవరినీ అనుమతించరు! భక్తులు "వెనక్కి" నడవాల్సిందే!)

యెన్ని గంటలూ, యెంతమందీ లెఖ్ఖలు కాదు. 

వెంటనే ప్రణాళిక రచించండి. లేదా రచింపచెయ్యండి! (చేతకాకపోతే--సో కాల్డ్ ఆగమ పండితుల్ని కాదు--ఎల్ & టీ వారినో, జీ ఎం ఆర్ వారినో సంప్రదించండి! ఆ మాత్రం ఖర్చు స్వామి భరించగలడు!)

వింటారా?

No comments: