Wednesday, May 25, 2011

శ్రీవారి ఆలయం



సేవలూ, పురావస్తు

శ్రీసేవ "ప్రాజెక్ట్" నిపుణుల సూచనలు వివాదాస్పదమౌతున్న నేపధ్యంలో ప్రాజెక్టుని సమీక్షించి, తుదిమెరుగులు దిద్దడం, అనుమానాలని నివృత్తి చెయ్యాలని సాధికార మండలి భావిస్తోంది(ట) 07-02-2011 న.

శ్రీవారికి విరాళాలు ఇచ్చే 'భక్తులకు ' ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావాలని "తి తి దే" (అంటే సాధికార మండలి అని కవి హృదయం!) నిర్ణయించింది(ట). దాతలనుంచి విరాళాలు అందినవెంటనే, వారికి ప్రత్యేక "పాసు పుస్తకాలు" జారీ చేస్తారు(ట). 

తిరుమలలో క్రొత్తగా నిర్మిస్తున్న నిత్య అన్నదాన సముదాయాన్ని ఉగాదినాటికి అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నారు(ట). "రోటీ"లు వడ్డించడానికి కూడా యేర్పాట్లు చేస్తున్నారు(ట). (పులిని చూసి నక్క వాతలు పెట్టుకొంటే, వాతలు లేని నక్కని చూసి పులి తన చారలు "డిటర్జెంట్" తో తొలగించుకుందామనుకుందిట!). అంటే, షిరిడీ & తిరుమల ఆర్ హేండ్ ఇన్ హేండ్! (మన బుర్రోవాదుల ఆలోచనలు ఇలాగే వుంటాయి మరి!)

"మూడువేలమంది" (ఇదేదో అప్పుతచ్చు అనుకుంటా!) భోజనం చేసే సౌకర్యం వున్న నేపధ్యంలో, ఆ మేరకు సిబ్బంది నియామకం పై కూడా 'సమీక్షించారు'(ట). 

ఇంతవరకూ బాగానే వుంది. 

శ్రీవారి ఆలయాన్ని పురావస్తు శాఖవారికి అప్పగిస్తాము అని నిశ్చయించిన, (మళ్లీ "థూ నా బొడ్డు" అనుకొన్నారు!) సందర్భంలో, పురావస్తు శాఖ సంచాలకుడు, "నిత్యపూజలూ, వుత్సవాల్లో తమ జోక్యం వుండబోదు" అని ప్రకటించారట--"వొకవేళ ఆ దేవాలయం తమ పరిథిలోకి వచ్చినా"--అని! (ఆలూ లేదు, చూలూ లేదు, కొడుకు పేరు....అన్నట్టు!)

ఒకవేళ అలా జరిగినా, "ఆలయంలో ఓ మేకు కొట్టాలన్నా, తమ అనుమతి తీసుకోవాలంటూ జరుగుతున్న 'ప్రచారంలో' యేమాత్రం నిజం లేదని కూడా చెప్పారట వారు. (పురావస్తు శాఖవారి అధీనంలో వున్న యే నిర్మాణంలో అయినా, యెవరైనా, వాళ్లిష్టం వచ్చినట్టు మేకులు కొట్టుకోవచ్చా? అనే విషయం యెవరూ ఆయనని అడగలేదు మరి.) 

ఇంకా, ఆలయ పాలకమండలి ఛైర్మన్లు మారినప్పుడల్లా వాళ్ల ఇష్టానుసారంగా ప్రాచీన నిర్మాణాలని 'ధ్వంసం' చేస్తున్నారనీ, వేయికాళ్లమంటపం, వాహన మండపాల కూల్చివేతే ఇందుకు నిదర్శనమనీ కూడా అన్నారు(ట).

.....తరువాయి మరోసారి.

2 comments:

Indian Minerva said...

వాతలు లేని నక్కని చూసి పులి తన చారలు "డిటర్జెంట్" తో తొలగించుకుందామనుకుందిట.

:D :D

A K Sastry said...

డియర్ Indian Minerva!

కొంచెం వెరయిటీ కోసం ప్రయత్నించానంతే!

నచ్చినందుకు ధన్యవాదాలు.