Tuesday, May 24, 2011

"అనంత.....




......సమస్యలమయం"!

ఆదికేశవుడి మానస (గర్భజనిత) పుత్రిక "ఆనంద......మయం" కార్యక్రమానికి 95 కిలోల బంగారం, 12 కోట్ల నగదూ వచ్చిందట--హైకోర్టు తీర్పు ఇచ్చేటప్పటికి.

12 కొట్ల నగదుకి సంబంధించిన దాతల/భక్తుల వివరాలు వున్నాయట. కానీ, బంగారానికి సంబంధించి, చాలావరకు వివరాలు లేవట. ఆదికేశవుడికి వ్రాసినా, వ్యతిరేక సమాధానమే వచ్చిందట!

సాధికార మండలి నిర్ణయం ప్రకారం, ఆ పథకం విరాళాలు ఇచ్చినవారికే తిరిగి ఇచ్చెయ్యడం గానీ, వారి "అనుమతితో" వేరే పథకాలకి మళ్లించడం గానీ చెయ్యాలట.

మరి పేర్లు వున్నా చిరునామాలు లేనివాళ్లనీ, పేర్లు కూడా లేనివాళ్లనీ యెలా 'సంప్రతిస్తా'రబ్బా? ఒక్క రిలయన్స్ సంస్థ మాత్రమే తన విరాళం గురించి సమాధానం ఇచ్చిందట. మిగిలినవాళ్లందరూ "నస్మరంతిగాళ్లు"!

మరి ఆ బంగారం అంతా యెవరిచ్చారో, యెందుకు, యెలా ఇచ్చారో, వసూలు చేసినవాళ్లు యెంతకి యెంత జమకట్టారో.....దర్యాప్తు చెయ్యాలా, అఖ్ఖరలేదా?

(ఈవోగారు యేమైనా చేస్తున్నారా, తట్టా బుట్టా సర్దుకొంటున్నారా?!)

లేక, "పవిత్రత" అనే చాపక్రిందకి నెట్టేద్దామా?  

No comments: